కాంగ్రెస్ నేతల బతుకే అవినీతిమయం : బాల్క సుమన్ | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ నేతల బతుకే అవినీతిమయం : బాల్క సుమన్

Published Fri, Aug 26 2016 2:10 AM

కాంగ్రెస్ నేతల బతుకే అవినీతిమయం : బాల్క సుమన్ - Sakshi

టీఆర్‌ఎస్ ఎంపీ బాల్క సుమన్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేతల బతుకే పూర్తిగా అవినీతి మయమని, ప్రాజెక్టుల అంచనాలను రాత్రికి రాత్రే పెంచి దోచుకుతిన్న చరిత్ర వారిదని టీఆర్‌ఎస్ ఎంపీ బాల్క సుమన్ మండిపడ్డారు. 2012 లోపే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేస్తామన్న కాంగ్రెస్, పదేళ్లు ఏం చేసిందన్నారు. గతంలో మహారాష్ట్రతో జరిగిన ఒప్పంద పత్రాన్ని చూపమంటే కుక్కల్లా మొరుగుతున్నారు తప్పితే దాన్ని చూపించలేకపోయారన్నారు. గురువారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు.

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి దమ్ముంటే సీఎం కేసీఆర్ విసిరిన సవాలును స్వీకరించాలన్నారు. మధుయాష్కీ వంటి నేతలు తప్పుడు కూతలు కూస్తున్నారని, వీరు తమ నోటిని అదుపులో పెట్టుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సుమన్ హెచ్చరించారు.
 
కాంగ్రెస్ మాయ మాటలను ప్రజలు నమ్మరు: కొప్పుల
ప్రాజెక్టులపై కాంగ్రెస్ నాయకులు చెప్పే మాయ మాటలను ప్రజలు నమ్మరని కొప్పులఅన్నారు. పొరుగు రాష్ట్రాలతో వివాదాలను గత పాలకులు కోరుకోగా, సఖ్యత, సామరస్యంతోనే అభివృద్ధి సాధ్యమని కేసీఆర్ విశ్వసిస్తున్నారన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement