అమర్‌నాథ్‌లో చిక్కుకున్న మణుగూరువాసులు | Sakshi
Sakshi News home page

అమర్‌నాథ్‌లో చిక్కుకున్న మణుగూరువాసులు

Published Mon, Jul 27 2015 1:15 AM

Amarnath In Trapped Manuguru Residents

మణుగూరు: ఖమ్మం జిల్లా మణుగూరు మండలం తోగ్గూడెం గ్రామానికి  చెందిన ముగ్గురు అమర్‌నాథ్ యూత్రకు వెళ్లి మార్గమధ్యలో చిక్కుకున్నారు. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వీరంకి వెంకట్రావ్, అతని భార్య న్యాయవాది వీరంకి పద్మావతి, ఆమె సోదరుడు మురళీ ఈనెల 19న అమర్‌నాథ్ యాత్రకు మణుగూరు నుంచి బయలు దేరారు. శ్రీనగర్ భాల్‌థార్ మధ్యన తోన్ మార్గంలో కొండచరియలు విరిగి పడటంతో వారు భాల్‌థార్‌లోనే  ఉండిపోయారు. వీరితోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని జంగారెడ్డిగూడెంకు చెందిన 100 మంది అక్కడ ఉన్నారని పద్మావతి ఆదివారం రాత్రి ‘సాక్షి’కి ఫోన్‌చేసి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తమను తీసుకెళ్లే ప్రయత్నం చేయూలని కోరారు.

Advertisement
Advertisement