నిద్రిస్తున్న వారిపై దూసుకెళ్లిన లారీ: ఇద్దరి మృతి | Sakshi
Sakshi News home page

నిద్రిస్తున్న వారిపై దూసుకెళ్లిన లారీ: ఇద్దరి మృతి

Published Tue, Jul 28 2015 9:47 AM

2 died in road accident

కృష్ణలంక: విజయవాడలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. రాణిగారితోట సమీపంలో మంగళవారం తెల్లవారుజామున వారిధి వద్ద నిద్రిస్తున్న వారిపై లారీ దూసుకు పోవడంతో ఓ చిన్నారితోపాటు మరొకరు మృతి చెందారు. వివరాలు.. చేపల లోడుతో బెంజిసర్కిల్ నుంచి లారీ గుంటూరు వైపు వెళ్తోంది. ఈ క్రమంలో హైవే మార్గం అనుకుని డ్రైవర్ వారధికి అనుసంధానంగా ఉన్న వేరొక రూట్ లోకి లారీని తీసుకెళ్లాడు.

ముందుకు వెళ్లిన తర్వాత ఆ రూటు హైవేకు వెళ్లేది కాదని ఒక్కసారిగా లారీ ని పక్కకు తిప్పాడు. దీంతో అక్కడే నిద్రిస్తున్నవారిపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో కోటేశ్వరమ్మ(55), సుబ్రహ్మణ్యం(6) ప్రాణాలు కోల్పోయారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుందని బాధితులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు.

Advertisement
Advertisement