మైనారిటీ సాహిత్యానికి మొదటి చేర్పు
తెలుగు కథలో గురజాడ ‘పెద్ద మసీదు’ ఉంది. శ్రీపాద ‘ఇలాంటి తవ్వాయి వస్తే’ ఉంది. రాయలసీమ తొలితరం కథల్లో ఒక ముస్లిం వైద్యుని చేత కొడుకుకు వైద్యం నిరాకరించే చాందస అత్తగారిని ఎదిరించే కోడలి కథ ఉంది. నెల్లూరు కేశవస్వామి కథల నిండా ముస్లిములే. ముస్లింల జీవితాలు, పాత్రలు తెలుగు కథల్లో ఆది నుంచీ ఉన్నాయి. అయితే అవి ముస్లిమేతరులు రాసినవి. ఒక ముస్లిం అయి ఉండి ముస్లింల జీవితాల గురించి రాయవచ్చని మొదటగా ప్రయత్నించింది షేక్ హుసేన్. ‘సత్యాగ్ని’ కలం పేరుతో ఈ ఒరవడిని దిద్దింది ఒక రాయలసీమ రచయిత కావడం ఆ ప్రాంతానికి గర్వకారణం.
1980వ దశకంలో ఆయన మొదలుపెట్టిన ఈ పరంపర ఆ తర్వాత తెలుగులో కొనసాగింది. ముఖ్యంగా ‘బా’ రహమతుల్లా (ప్రకాశం జిల్లా) వంటి రచయితలు తెలుగు ముస్లిం కథను ఒక మెట్టు పైన చేర్చారు. సలీం (ప్రకాశం జిల్లా) తొలి ముస్లిం జీవన నవల- ‘వెండి మేఘం’ రాసి తెలుగు నవలను సంపద్వంతం చేశారు. వీరిని మినహాయించి కోస్తా ప్రాంతంలో చెప్పుకోదగ్గ పురోగతి లేకపోయినా రాయలసీమలో, తెలంగాణ ప్రాంతంలో ముస్లిం కథ విస్తృతంగా వికసించింది. రాయలసీమలో దాదాహయత్, శశిశ్రీ (బేపారి రహంతుల్లా), మహమూద్, ఎన్నెస్ ఖలందర్, అక్కంపేట ఇబ్రహీం, ఇనయతుల్లా తదితరులతో పాటు షేక్ హుసేన్ స్వయంగా చెప్పుకున్నట్టు ఆయన కథాధోరణికి నిజమైన వారసుడిగా వేంపల్లి షరీఫ్ ఆవిర్భవించారు.
ఇక తెలంగాణలో ఖాజా ముస్లిం కథల పతాకనెత్తారు. ఆ వరుసలో అఫ్సర్, దిలావర్, షాజహానా, హనీఫ్, ఇక్బాల్ చంద్, అన్వర్, పానమరక అలీ, యూసఫ్ బాబా, కవి యాకూబ్, యాకూబ్ పాషా తదితరులు తెలంగాణ ముస్లిం జీవనాన్ని విస్తారంగా కథా సాహిత్యంలో నమోదు చేశారు. ఇన్ని కథలు, పుస్తకాలు వచ్చినా మొదటి మెట్టు వేసింది షేక్ హుసేన్ అనేది చరిత్రలో నమోదైన సత్యం. హుసేన్ కథలు సూటిగా సరళంగా ఉంటాయి. సమస్యను తీసుకుని క్లుప్తంగా చర్చిస్తాయి. ఒకరికి లొంగని పరిష్కారాలు చూపిస్తాయి.
తొలి రోజులలో షేక్ హుసేన్ కథలు దాదాపు ఎఫ్.ఐ.ఆర్లను తలపించినా రాను రాను వాటి పరిధి, లోతు విస్తారమైంది. ముస్లింల కథలు రాయడం మొదలుపెట్టే సమయానికి ఆయన సంయమనం పాటించడం చూస్తాం. అంతర్గత సంస్కరణ కోసం ముస్లిం సమాజానికి ఆయన చెప్పిన హితవు వంటి కథలు ఈ సంపుటిలో అనేకం ఉన్నాయి. ‘యంత్రం’, ‘ముతా’, ‘పాచికలు’, ‘ఖులా’, ‘హలాలా’... ఇవన్నీ హుసేన్ కథల్లోనే కాదు తెలుగు కథల్లో కూడా ముఖ్యమైనవి. ముస్లిం సమాజం ఎలా వంచనకు గురి అవుతున్నదో పెత్తందార్ల చేతుల్లో ముస్లింలు ఎలా పావులవుతున్నారో హుసేన్ రాస్తారు.
అలాగే స్త్రీల తరఫున, స్త్రీల కొరకు వకాల్తా పుచ్చుకోవడమే కాదు ఇస్లాంలో స్త్రీల అణచివేత ఉందనే దురభిప్రాయాన్ని తొలగిస్తూ వారికి ఉన్న హక్కులను కూడా కథలుగా మలిచారు. మగాడి తరఫున ‘తలాక్’ మాత్రమే అందరికీ తెలుసు. కాని వివాహ బంధం నుంచి బయటపడటానికి స్త్రీకి ’ఖులా’ హక్కు ఇస్లాం ఇచ్చిందని ఎందరికి తెలుసు? ‘ముతా’ పేరుతో పేద ఆడపిల్లలను నెలకూ రెండు నెల్లకూ (దుబాయ్ షేకులు) పెళ్లి చేసుకునే ఆచారం ఉందని నమ్మించేవారిని అదసలు ఇస్లాంలో సమ్మతం కాదనే కథ వీటిలో ఉంది.
స్త్రీలు తమ కాళ్ల మీద తాము నిలబడాలనుకోవడం, ఆత్మవిశ్వాసంతో ముందుకు నడవాలనుకోవడం హుసేన్ కథల్లో బలమైన స్టాండ్. లోపలి రచయితలు ముస్లిం సమాజాన్ని దుమ్మెత్తి పోయడం కన్నా ముందు వారికి అవసరమైన సాహిత్యం అందించాలనే ధోరణి హుసేన్ది. ఇది అభిలషణీయమైన ధోరణి.
ఇందులో ఒకటి రెండు జ్ఞాపకాల వంటి కథలు ఉన్నాయి. అవి లేకపోయినా పర్వాలేదు. ఒక కథ- ‘ఖబరా ఖోదువ్’ (గోరి తవ్వేవాడు) మీద ప్రేమ్చంద్ ‘కఫన్’ ప్రభావం ఉంది. కేతు విశ్వనాథరెడ్డి, సింగమనేని నారాయణ ముందుమాటలు పుస్తకం విలువను పెంచాయి.
తెలుగులో మొదటి ముస్లిం కథలున్న ఈ సంపుటి ప్రతి ఒక్కరూ చదవతగ్గది.
- నెటిజన్ కిశోర్
సత్యాగ్ని కథలు- షేక్ హుసేన్ సత్యాగ్ని
వెల: రూ.120
ప్రతులకు: 9866040810
సత్యాగ్ని కథలు
Published Sat, Apr 18 2015 1:12 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement