పోలవరం బరిలో 9 మంది | Sakshi
Sakshi News home page

పోలవరం బరిలో 9 మంది

Published Wed, Apr 23 2014 8:07 PM

పోలవరం బరిలో 9 మంది - Sakshi

హైదరాబాద్: సీమాంధ్రలో నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది. ఎన్నికల బరిలో ఎంత మంది ఉన్నారనే విషయాన్ని ఎన్నికల సంఘం వెల్లడించింది. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం అసెంబ్లీ స్థానానికి 9 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. గోపాలపురంలో ఏడుగురు, కొవ్వూరులో 13 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

చిత్తూరు జిల్లాలో నామినేషన్ల ఉపసంహరణ తర్వాత శ్రీకాళహస్తి అసెంబ్లీ స్థానానికి బరిలో 20 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. చంద్రగిరి-5, మదనపల్లి- 19, తంబళ్లపల్లి- 15, పీలేరు- 15, కుప్పం - 8, నగిరి- 7, సత్యవేడు-14, గంగాధరనెల్లూరు-13, చిత్తూరు-15, పూతలపట్టు- 6, పలమనేరులో 8 మంది పోటీ చేస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement