సాక్షి, విజయనగరం/విజయనగరం కంటోన్మెంట్/విజయనగరం మున్సిపాల్టీ: ‘‘కడుపు నిండా దుఃఖాన్ని నింపుకొని ఉన్న మీరు మీ బాధలు చెప్పండి. మీ మాటలతోనైనా గుడ్డి ప్రభుత్వానికి చూపు తెప్పిద్దాం’’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు నిర్మాణానికి భూసేకరణ చేస్తున్న గ్రామాల్లో ఆయన సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా గూడెపువలస, కవులవాడ, ఎ.రావివలస గ్రామాల్లో నిర్వాసితులతో మాట్లాడారు. ‘‘ఇక్కడ జరుగుతున్న అన్యాయం, దౌర్జన్యం కేంద్ర ప్రభుత్వానికి, ఇతర రాష్ట్రాలకు తెలియాలి. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏ విధంగా గడ్డి పెట్టాలో, ఎలా బుద్ధి చెప్పాలో మీ నోటితో మీరే చెప్పండి’’ అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జగన్ ఎదుట పలువురు బాధితులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు.
ప్రాణాలైనా ఇస్తాం.. భూములు వదులుకోం
మాకు రెండెకరాల భూమి ఉంది. ఇద్దరం ఆడపిల్లలం, ఒక తమ్ముడు. ఎర్రబస్సు కూడా లేని ఈ ఊరిలో ఎయిర్పోర్టు ఎందుకు సార్? వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన ఇంటిలో బతుకుతున్నాం. ఇప్పుడు ఆ ఇల్లు కూడా లాక్కుంటే మేం ఎలా బతకాలి? మా పెళ్లిళ్లు ఎలా అవుతాయి? మాకు ఎయిర్పోర్టు వద్దు. మేం ప్రాణాలైనా ఇస్తాం కానీ మా భూములు మాత్రం ఇవ్వం.
- శిరాపు నర్సాయమ్మ, రెడ్డికంచేరు
మీ విమానం పెద్దల భూముల్లో ఎగరదా?
మాకు రెండెకరాల భూమి ఉంది. అది లాక్కుంటే కూలీలుగా మారిపోతాం. అయ్యా.. చంద్రబాబు గారూ మీ విమానం పెద్దల భూ ముల్లో ఎగరదా? పేదల భూముల్లోనే ఎగురుతుందా? మా భూములకోసం 30 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నాం. చంద్రబాబు మా భూములు లాక్కొని ముష్టి వేస్తామంటున్నారు. మీ ముష్టి మాకు వద్దు, మా భూములుంటే చాలు.
- కొండపు బుజ్జి, గూడెపువలస
అయ్యన్న, గంటా భూములెందుకు వదిలారు?
నిజంగా చంద్రబాబుకు అభివృద్ధి చేయాలనుకుంటే... అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాస్రావుల భూములను తీసుకొని మా భూము లు కూడా తీసుకుంటే ఇంతగా బాధపడకపోము. కానీ వాళ్ల భూములను వదిలి మావి లాక్కుంటారా? మాలాంటి పేదల కడుపు కొడతారా? ఇదేనా న్యాయం?
- వంశీరెడ్డి, రెడ్డి కంచేరు
అడవుల్లోకి పంపుతున్నారు
నాకు 80 సెంట్ల భూమి ఉంది. మహానుభావుడు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తాగడానికి నీరు, తినడానికి తిండి, ఉపాధి పనులు ఇచ్చారు. ఇప్పుడొచ్చిన వారు ఎయిర్పోర్టులంటారు. ప్రజల భూములను లాక్కొని అన్యాయం చేయాలనుకుంటున్నారు. విమానాశ్రయం పేరుతో మమ్మల్ని అడవుల్లోకి పంపించేస్తున్నారు.
- జె.సన్నాసిరావు
శవాల మీద కడతారా?
మాకు అర ఎకరం భూమి ఉంది. కూలీ పనులు చేసుకొని బతుకుతున్నాం. అర ఎకరం భూమి లాక్కొని మమ్మల్ని ఎటో తగలెయ్యాలని చూస్తున్నారు. చంద్రబాబు మా శవాల మీద ఎయిర్పోర్టు కట్టాలనుకుంటున్నాడు. అలా కాకుండా ఓ బాంబు వేసి మమ్మల్ని చంపేసి అప్పుడు కట్టమనండి. మా భూముల్లోకి ఎవరు వస్తారో చూస్తాం.
- బి.నర్సయ్యమ్మ
ప్రభుత్వానికి చూపు తెప్పిద్దాం
Published Tue, Oct 6 2015 4:09 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement