రైల్వేగేట్: రైలు కింద పడి ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. వరంగల్ జీఆర్పీ ఎస్సై శ్రీనివాస్ కథనం ప్రకారం కరీంనగర్ జిల్లా రామగుడు మండలం వెలిశాలకు చెందిన బట్టూరి వాణి(20) మంగళవారం ఉదయం వరంగల్ ధర్మారం గేట్ వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. వాణికి హన్మకొండ గోపాల్పూర్కు చెందిన మూగవ్యక్తి దార్న కృష్ణతో గత ఆగస్టులో వివాహం జరిగింది. మూడు నెలల తర్వాత భర్త నుంచి విడాకుల తీసుకున్న వాణి ఆరు నెలలుగా ధర్మారంలో కూలి పనులు చేసుకుంటు జీవనం సాగిస్తుంది. ఈ క్రమంలో మంగళవారం కుటుంబ సభ్యులతో గొడవపడిన వాణి మధ్యాహ్నం ఇంటి నుంచి సెల్ రీచార్జి కోసమని వచ్చి ధర్మారం గేటు వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై వివరించారు. కేసు నమోదు చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం మృదేహాన్ని ఎంజీఎం మార్చురికి తరలించినట్లు చెప్పారు.
రైలుకింద పడి యువకుడు..
స్టేషన్ఘన్పూర్/కాజీపేట రూరల్: మండలంలోని శివునిపల్లికి చెందిన పెరుమల్లి చైతన్య(27) రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారం మధ్యాహ్నం జరి గింది. మండలంలోని శివునిపల్లి ఎస్సీ కాలనీకి చెందిన రాజేశ్వరి, సత్యనారాయణల కుమారుడు చైతన్య ఆటోడ్రైవర్గా పనిచేసేవాడు. కొద్దికాలంగా వ్యక్తిగత కారణాలతో అతడు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడన్నారు. ఈ క్రమంలో స్థానిక రైల్వే ఓవర్ బ్రిడ్జి సమీపాన రైల్వే ట్రాక్ వద్ద అప్లైన్లో గుర్తుతెలియని రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసకున్న మృతుడి తల్లి, కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. విషయం తెలుసుకున్న రైల్వే హెడ్కానిస్టేబుల్ విజయ్కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.