- అధ్యక్ష పదవి నాకంటే నాకంటూ వాగ్వాదం
- పరిశీలకుడి ముందే నేతల తోపులాట
- ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్న వైనం
- కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఇదే పరిస్థితి
సాక్షి, కరీంనగర్: కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ అడహక్ కమిటీ కన్వీనర్ పదవి కోసం తెలుగు తమ్ముళ్లు ఆదివారం బాహాబాహీకి దిగారు. పార్టీ రాష్ట్ర పరిశీలకుల ముందే వాగ్వాదానికి దిగిన పార్టీ నేతలు ఒకరిపై ఒకరు చేయి చేసుకునే స్థాయికి గొడవ వెళ్లింది. మాటామాట పెరిగి ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకోగా, గ్రూపులుగా విడిపోయి గొడవలకు దిగడం ఉద్రిక్తతకు దారితీసింది. జిల్లాల విభజన కారణంగా పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఖాళీ కావడంతో ఆదివారం ఉదయం కరీంనగర్, మధ్యాహ్నం సిరిసిల్ల రాజన్న జిల్లాల్లో టీడీపీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశానికి పరిశీలకులుగా ఒంటేరు ప్రతాపరెడ్డి హాజరయ్యారు.
సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు కల్యాణపు ఆగయ్య, మేడిపల్లి సత్యం, చందా గాంధీలు సీనియర్లకు పార్టీ అధ్యక్షులుగా అవకాశం కల్పించాలని ప్రసంగించారు. అయితే, వీటిని వక్రీకరిస్తూ కవ్వంపెల్లి సత్యనారాయణ వ్యంగ్య ప్రసంగం చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. అధ్యక్ష పదవి నాకు కావాలంటే.. నాకు ఇవ్వాలని వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో కోపోద్రిక్తులైన నాయకులు, కార్యకర్తలు పరస్పర ఘర్షణకు దిగారు. సంయమనం కోల్పోయిన కార్యకర్తలు వేదికపైకి కుర్చీలు విసరడంతో రసాభాసగా మారింది. ఈ సందర్భంగా ఇరువర్గాలు తోపులాడుకుంటూ ఒకరిపై మరొకరు పడి తన్నుకున్నారు. ఒంటేరు ప్రతాపరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు విజయరమణారావులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపుచేశారు.
ఈ పదవికి ఆరుగురు నేతలు పోటీపడగా, గొడవకు దిగిన ముగ్గురు నేతలు అధ్యక్ష రేసులో ఉన్నవారే. అలాగే, కాగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన కార్యకర్తల సమావేశం సైతం రసాభాస జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్ష పదవి కోసం అన్నమనేని నర్సింగరావు, బీసీ సెల్ రాష్ట్ర నాయకుడు రెడ్డబోయిన గోపీ, కౌన్సిలర్ బార్ల సందీప్లు పోటీపడుతుండగా, సమావేశం సందర్భంగా వీరంతా బలప్రదర్శనకు దిగారు. ఉమ్మడి జిల్లాలో పార్టీలో కీలకంగా వ్యవహరించిన ఓ నాయకుడు, ఆ సమావేశంలో అన్నమనేని నర్సింగరావుకు పార్టీ అధ్యక్షపదవి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని పరిశీలకులు ఒంటేరు ప్రతాపరెడ్డి ముందే నాయకులు విమర్శలు గుప్పించారు. మాటామాట పెరిగి మూడు గ్రూపుల నాయకులు, కార్యకర్తలు కుర్చీలు విసురుకోవడంతో రసాభాస జరిగింది. దీంతో కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో కమిటీలను ప్రకటించకుండానే పార్టీ పరిశీలకులు వెనుతిరిగారు.
తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ
Published Mon, Oct 24 2016 2:21 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement