విద్యార్థి అదృశ్యం | Sakshi
Sakshi News home page

విద్యార్థి అదృశ్యం

Published Fri, Apr 21 2017 11:53 PM

student missing

అనంతపురం : చదువుకోవడం ఇష్టంలేని ఓ విద్యార్థి అదృశ్యమయ్యాడు. నగరంలోని నీరుగంటివీధికి చెందిన షేక్‌ డానిష్‌ (17) నార్పల పాలిటెక్నిక్‌ కళాశాలలో చదువుతుండేవాడు. అయితే చదువుపై ఇష్టం లేక కళాశాలకు రెగ్యులర్‌గా వెళ్లేవాడు కాదు. ఈ క్రమంలో ఎక్కువగా గైర్హాజరుకావడంతో వార్షిక పరీక్షలకు అనుమతించలేదు. అప్పటి నుంచి ఇంటివద్దే ఉంటున్నాడు. బైపాస్‌ రోడ్డు సమీపంలో వర్క్‌షాపులో పనికి వెళ్లేవాడు. ఈ నెల 18న ఇంటి నుంచి వెళ్లిన డానిష్‌ తిరిగి రాలేదు. తండ్రి మహమ్మద్‌ ఆసిఫ్‌ దుబాయిలో ఉంటున్నాడు. చిన్నాన్న సయ్యద్‌ నూర్‌బాషా వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. హెడ్‌కానిస్టేబుల్‌ శ్రీనివాసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement