►పెన్గంగ పరీవాహక ప్రాంతాల నుంచి ఇసుక తరలింపు
►జిల్లాలో నదులు, వాగుల ప్రాంతాల్లో 20కి పైగా నిల్వలు
►ఫిబ్రవరిలో సర్వే చేసినా ఇవ్వని రీచ్ అనుమతులు
►అక్రమార్కుల ఆగడాలతో ప్రభుత్వాదాయానికి భారీ గండి
ఆదిలాబాద్: జిల్లాలో ఇసుక హారతిలా కరిగిపోతూనే ఉంది. వాగులు, వంకలు, ఒర్రెలు, నదుల నుంచి అక్రమార్కులు ఇసుకను నిత్యం తోడేçస్తూనే ఉన్నారు. ఇసుక నిల్వలను గుర్తించిన ప్రభుత్వం ఇప్పటివరకు రీచ్లకు అనుమతివ్వలేదు. దీంతో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతుండగా.. ప్రభుత్వానికి భారీగా గండిపడుతోంది. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ఇసుకాసురుల అక్రమ దందా మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది.
రీచ్ అనుమతుల్లో జాప్యం..
జిల్లా స్థాయి ఇసుక కమిటీ చైర్మన్గా కలెక్టర్, వైస్ చైర్మన్గా జాయింట్ కలెక్టర్, మెంబర్ కన్వీనర్గా భూగర్భ గనుల శాఖ ఏడీ ఉన్నారు. ఐటీడీఏ పీవో, జిల్లా పంచాయతీ అధికారి, భూగర్భ జలాల శాఖ డీడీ, నీటిపారుదల శాఖ ఈఈ, గ్రామీణ నీటి సరఫరా ఈఈ, పొల్యూషన్ కంట్రోల్బోర్డ్ పర్యావరణ ఇంజనీర్, తెలంగాణ ఖనిజ అభివృద్ధి సంస్థ నుంచి ప్రతిపాదిత సభ్యుడు మెంబర్లుగా ఉన్నారు. గత ఫిబ్రవరిలో ప్రభుత్వం జాయింట్ కమిటీ (భూగర్భ గనులు, రెవెన్యూ, భూగర్భ జలాలు, నీటిపారుదల శాఖ) ఇసుక రీచ్లను గుర్తించేందుకు సర్వే నిర్వహించింది. భీంపూర్, ఉట్నూర్, జైనథ్, తలమడుగు, సిరికొండ, ఆదిలాబాద్రూరల్ మండలాల్లో నది, వాగులు, వంకలు, ఒర్రెల సమీపంలో ఇసుక నిల్వలను గుర్తించారు.
ఇప్పటివరకు ఇసుక నిల్వలున్న వాటికి రీచ్లుగా అనుమతి ఇవ్వకపోవడంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి పడుతోంది. ప్రధానంగా ఇసుకకు ఒక ధర నిర్ణయించి దాని ఆధారంగా ప్రభుత్వానికి సీనరేజ్ చార్జీల రూపంలో ప్రతీ క్యూబిక్ మీటర్కు రూ.40 చొప్పున చెల్లించాలి. మండల స్థాయిలో తహసీల్దార్, గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు ఇసుక మేటలను తీసే, సరఫరా చేసే ప్రక్రియను పరిశీలించి వేబిల్లు ఆధారంగా ప్రక్రియ కొనసాగించాలి. కాగా జిల్లాలో ఇది ఎక్కడా అమలు కావడం లేదు.
ప్రభుత్వాదాయానికి గండి.
జిల్లాలో ప్రధానంగా భూగర్భ గనుల శాఖకు పెద్ద తరహా ఖనిజం మాంగనీస్, చిన్న తరహా ఖనిజాలు స్టోన్ క్రషర్ల ద్వారా ఆదాయం లభిస్తుంది. ఈ ఏడాది రూ7.21 కోట్లు లక్ష్యం నిర్ణయించగా, జూన్ వరకు రూ.4.16 కోట్ల ఆదాయం లభించింది. ఇసుక ద్వారా ఆదాయం లభించే మార్గం ఉన్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతో నష్టం జరుగుతోంది. ఇసుకాసురులు ఎలాంటి అనుమతి లేకుండానే నది పరీవాహక ప్రాంతాలు, వాగుల్లో వేలాది క్యూబిక్ మీటర్ల ఇసుకను యథేచ్ఛగా దోపిడీ చేసేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో ట్రాక్టర్ (రెండున్నర క్యూబిక్ మీటర్లు) ఇసకకు రూ.2వేల నుంచి రూ.రెండున్నర వేలు, టిప్పర్ (8 క్యూబిక్ మీటర్లు) ఇసుకకు రూ.8వేల నుంచి రూ.10వేల వరకు విక్రయిస్తూ లాభాలు గడిస్తున్నారు.
పెన్గంగా నుంచి దోపిడీ..
పెన్గంగా నది నుంచి ఇసుక దోపిడీ అడ్డగోలుగా కొనసాగుతోంది. ప్రస్తుతం వర్షాలు లేకపోవడంతో పెన్గంగాలో నీటి ప్రవాహం అంతగా లేదు. ఇసుక మేటలు బయట పడ్డాయి. దీంతో అక్రమార్కుల చూపు దీనిపై పడింది. పెన్గంగా పరీవాహక ప్రాంతాల్లో సుమారు 10వేల క్యూబిక్ మీటర్ల ఇసుక మేటలున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇటీవల జైనథ్ మండలంలో పెన్గంగా పరీవాహక ప్రాంతాల్లో ఇసుకను తోడేందుకు లారీలు, టిప్పర్లు సులువుగా వచ్చేలా నది గచ్చు బండరాళ్లను జిలిటెన్ స్టిక్లతో పేల్చివేయడం సంచలనం కలిగిస్తోంది.
వీడీసీలకు ఆదాయం..
కొన్ని గ్రామాల్లో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు అనధికారికంగా టెండర్లు నిర్వహించి ఇసుకను వాగుల్లో నుంచి దగ్గరుండి తరలిస్తున్నారు. మరికొన్ని గ్రామాల్లో అనధికారికంగా టెండర్ అప్పగిస్తున్నారు. ఇలా గ్రామ అభివృద్ధి కమిటీలు, కొంతమంది కాంట్రాక్టర్లు ఇసుక ద్వారా లక్షల ఆదాయం పొందుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. వాల్టా చట్టం ప్రకారం అనుమతి లేకుండా ఇసుకను తోడడం చట్టరీత్యా నేరం. అయితే ప్రభుత్వ పనులకు ఇసుకను ఉపయోగించేందుకు వాగుల నుంచి ఇసుకను తీసుకువస్తున్నట్లు చెబుతూ అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇసుక టెండర్లు తీసుకున్న వ్యక్తులు లక్షల్లో సంపాదిస్తున్నారు.
ఇసుక దోపిడీ
Published Mon, Aug 7 2017 11:47 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బిడ్డను చూడకుండానే కన్నుమూసిన తల్లి
వికసించిన మే పుష్పం
క్లుప్తంగా
విషపురుగు కాటుతో బాలుడు మృతి
పెళ్లింట విషాదం●
ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు వ్యాసరచన పోటీలు
విద్యుత్ తీగలకు తగిలి బొలెరో దగ్ధం
‘వంశీ గెలిస్తే కార్మికుల పక్షాన గొంతు వినిపిస్తాడు’
దంపతుల ఆత్మహత్యాయత్నం
‘బీఆర్ఎస్కే మాదిగల మద్దతు’
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement