♦ అక్రమ రవాణా నిరోధానికి చెక్పోస్టుల ఏర్పాటు: మంత్రి హరీశ్
♦ హైదరాబాద్, రంగారెడ్డిలో మైనింగ్ జోన్లకు అనుమతి
♦ ‘సేవ్ గండిపేట’ మొదటి దశకు రూ.12 కోట్లు
సాక్షి, హైదరాబాద్: పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా రవాణా అవుతున్న ఇసుక మూలంగా రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లుతోందని నీటి పారుదల, మైనింగ్ శాఖ మంత్రి టి.హరీశ్రావు అన్నారు. ఇసుక అక్రమ రవాణా నిరోధించేందుకు చెక్పోస్టుల నిర్వహణ మరింత కట్టుదిట్టంగా చేయాలని అధికారులను ఆదేశించారు. మైనింగ్తో పాటు వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో మంగళవారం సచివాలయంలో పలు అంశాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. పెద్దసంఖ్యలో సమీకృత చెక్పోస్టుల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేయాల్సిందిగా ఆదేశించారు. మైనింగ్, రెవెన్యూ, వాణిజ్య పన్నులు, అటవీ, మార్కెటింగ్ శాఖల అధికారులు చెక్పోస్టుల ఏర్పాటు, నిర్వహణకు ప్రత్యేకంగా సమావేశం కావాలన్నారు.
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో గుర్తించిన మైనింగ్ జోన్లకు అనుమతులు ఇవ్వాల్సిందిగా రెవెన్యూ, అటవీ శాఖల అధికారులను మంత్రి హరీశ్రావు ఆదేశించారు. రంగారెడ్డి జిల్లాలో 14 మండలాల్లో అక్రమంగా కొనసాగుతున్న మైనింగ్ను తక్షణమే అరికట్టాలని, మైనింగ్ జోన్లలో అనుమతులు పొందిన విస్తీర్ణం మేరకే మైనింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుకకు ప్రత్యామ్నాయంగా రాతి ఇసుక వాడకాన్ని ప్రోత్సహించేలా మైనింగ్ శాఖ కార్యాచరణ రూపొందించాల్సిందిగా సూచించారు. ఖమ్మం జిల్లాలో బెరైటీస్ లీజులపై ఉన్న కోర్టు కేసుల స్థితిగతులపై ఆరా తీశారు. కేసులను సత్వరమే పరిష్కరించుకుని సర్వే పూర్తి చేయాలన్నారు.
సేవ్ గండిపేటకు మిషన్ కాకతీయ నిధులు
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన గండిపేట చెరువును పరిరక్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి హరీశ్రావు సమీక్ష నిర్వహించారు. మిషన్ కాకతీయ ట్రస్టు ద్వారా నిధులు సేకరించి గండిపేట చెరువు పరిరక్షణ దిశగా పలు కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. గండిపేట చెరువు అభివృద్ధికి రూ. 50 కోట్లు అవసరమవుతాయని అంచనా వేయగా, తొలి విడతలో రూ.12 కోట్లతో ఎఫ్టీఎల్ నిర్ధారణ, వాకింగ్ ట్రాక్, ఫెన్సింగ్ తదితర పనులను ప్రతిపాదించారు. చెరువు అభివృద్ధికి సేవ్ గండిపేట పేరిట స్టార్ క్రికెట్ మ్యాచ్లు, బెనిఫిట్ షోలు, 10కె రన్ వంటివి నిర్వహించాలని సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్కు సూచించారు. సమావేశంలో నీటిపారుదల, రెవెన్యూ, పరిశ్రమల, పురపాలక శాఖల ముఖ్య కార్యదర్శులు ఎస్కే జోషి, బీఆర్ మీనా, అరవింద్కుమార్, ఎంజీ గోపాల్, అదనపు పీసీసీఎఫ్ శోభ, టీఎస్ఎండీసీ ఎండీ ఇలంబర్తి, సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్రావు తదితరులు పాల్గొన్నారు.
పొరుగు రాష్ట్రాల ఇసుకను నియంత్రించండి
Published Wed, Dec 2 2015 3:17 AM
Advertisement
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ప్రముఖ కమెడియన్ మంచి మనసు.. ఏకంగా లక్షల సాయం
పోలింగ్ ఏజెంట్ పై టీడీపీ మూకల దాడి
ఓటు హక్కు వినియోగించుకున్న టాలీవుడ్ ప్రముఖులు
మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
చాబహర్ పోర్ట్ నిర్వహణకు ఒప్పందం
మన ఓటే మన భవిత.. కదలండి (ఫొటోలు)
ప్రశాంతంగా ఓటు వెయ్యండి మంచి చేసే వారికే ఓటు వెయ్యండి
బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
టీడీపీ నైరాశ్యంలోకి వెళ్లి హింసను ప్రేరేపిస్తోంది: సజ్జల
ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి
తప్పక చదవండి
- మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
- బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
Advertisement