► జిల్లా వైద్యాధికారి జలపతినాయక్
► నేడు జిల్లావ్యాప్తంగా మాత్రల పంపిణీ
నిర్మల్ రూరల్ : జాతీయ నులిపురుగుల నిర్మూలన దినం సందర్భంగా శుక్రవారం జిల్లాలో నులిపురుగులను నివారిం చేందుకు పిల్లలందరికీ అల్బెండజోల్ మాత్రలు అందిస్తున్నామని డీఎంహెచ్వో జలపతినాయక్ అన్నారు. స్థానిక జిల్లా వైద్యశాఖాధికారి కార్యాలయంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. తప్పనిసరిగా పిల్లలందరికీ ఈ మాత్రలు చేరేలా ఏర్పాట్లు పూర్తి చేశామన్నా రు. ఇప్పటికే సిబ్బందికి శిక్షణ ఇచ్చామని చెప్పారు.
19ఏళ్ల లోపు వారికి..
ప్రతీ 100మంది పిల్లలో 68మంది పిల్లలు నులిపురుగులతో బాధపడుతున్నారని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి (డీఐఓ) రాము తెలిపారు. కలుషిత ఆహారం, తాగునీరు తీసుకోవడం, తినేముందు, మలమూత్ర విసర్జనల తర్వాత చేతులు సబ్బుతో శుభ్రం చేసుకోకపోవడంతో పిల్లల కడుపులో నులిపురుగులు, నట్టలు తయారవుతాయన్నారు. వీటితో పిల్లలు శారీరకంగా, మానసికంగా ఎదగరని, ఎప్పుడూ సుస్తిగా ఉంటారన్నారు. వీటితో రక్తహీనత, ఎదుగుదల లోపం కూడా ఉంటుందన్నారు. ఒక ఏడాది నుంచి 19ఏళ్ల పిల్లల వరకు ఇవి కనిపిస్తాయని చెప్పారు. వీటి నివారణకు అల్బెండజోల్ మాత్రను ప్రతీ ఆరునెలలకొకటి చప్పరిస్తే సరిపోతుందన్నారు.
ఎవరికీ ఎలా అంటే..
నులిపురుగుల నిర్మూలనకు అల్బెండజోల్ మాత్రను మధ్యాహ్న భోజనం తర్వాత చప్పరించాలని డీఐవో పేర్కొన్నారు. ఆర్నెళ్లకోసారి ఒక మాత్రను మాత్రమే చప్పరించాలన్నారు. రెండేళ్లలోపు పిల్లలకు సగం మాత్రను దంచి పొడిగా చేసి గ్లాసు నీళ్లలో కలిపి తాగించాలన్నారు. రెండేళ్లపై నుంచి 19ఏళ్ల వరకు పిల్లలకు ఒక మాత్ర ఇవ్వాలన్నారు. వీటిని మింగకుండా చప్పరించేలా చూడాలని స్పష్టంచేశారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినంలో భాగంగా శుక్రవారం జిల్లాలో 2లక్షల 14వేల 500మంది పిల్లలకు మాత్రలు అందిస్తున్నామన్నారు. ఇప్పటికే అన్ని పాఠశాలలు, అంగన్ వాడీలు, కళాశాలలకు మాత్రలను చేరవేశామని చెప్పారు. శుక్రవారం వేసుకోని పిల్లలకు ఈనెల 15న వేయించాలని పేర్కొన్నారు.
పిల్లలందరికీ ‘అల్బెండజోల్’ అందించాలి
Published Fri, Feb 10 2017 10:47 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement