⇒ పద్మావతి మహిళా వైద్య కళాశాల యాజమాన్యం ఆదేశం
⇒ విద్యార్థులు రోజుకు రూ.వంద చొప్పున ఫైన్ చెల్లించాల్సిందే
⇒ గడువు దాటినా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు చెల్లించని ప్రభుత్వం
⇒ తల్లిదండ్రులను పిలిపించి మరీ హెచ్చరించిన యాజమాన్యం
హైదరాబాద్: తిరుపతిలోని పద్మావతి మహిళా కళాశాలలో చదువుతున్న ఎంబీబీఎస్ విద్యార్థినులకు కష్టకాలం వచ్చింది. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు చెల్లించకపోవడంతో మెడికోలు వీధినపడ్డారు. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదని, మీరు ఫీజు కడితేనే కళాశాలకు రావాలని, లేదంటే రానక్కరలేదని పద్మావతి మహిళా వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఆదేశించారు. దీంతో 50 మంది మెడికోలు ఏం చేయాలో తెలియక లోలోపల కుమిలిపోతున్నారు. కళాశాల యాజమాన్యం విద్యార్థినుల తల్లిదండ్రులను పిలిపించింది. మీ పిల్లలకు సంబంధించిన ఫీజులు ప్రభుత్వం నుంచి రాలేదని, ఇప్పటికే నెలన్నర దాటిపోయింది కాబట్టి రోజుకు రూ.వంద చొప్పున ఫైన్తో మొత్తం ఫీజు చెల్లిస్తేనే కళాశాలకు పంపించాలని స్పష్టం చేసింది.
ప్రభుత్వం నుంచి ఫీజులకు నోచుకోని విద్యార్థినులంతా పేద, మధ్యతరగతికి చెందిన వారే. 2015-16లో అల్పాదాయ, వెనుకబడిన కులాలు, ఆర్థికంగా వెనుకబడిన కులాల కింద దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఎవరికీ ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదు. వీరు ఇప్పుడు రెండో ఏడాదిలోకి అడుగుపెట్టారు. ఏడాదికి ట్యూషన్ ఫీజు కింద రూ.60 వేలు చెల్లించాలి. వాస్తవానికి వీళ్లందరూ ఫీజు రీయింబర్స్మెంట్కు అర్హులు కాబట్టి ప్రభుత్వమే ఫీజులు చెల్లించాలి. కానీ, గడువు ముగిసినా ప్రభుత్వం నుంచి ఫీజులు రాలేదు. ఫీజుల విషయంపై మాట్లాడేందుకు కొందరు విద్యార్థినులు ఈ నెల 18న ప్రిన్సిపల్ను కలిశారు. ఎంబీబీఎస్ సీటంటే ఏమనుకున్నారు, కోటి రూపాయలు ధర పలుకుతోంది. మీరు రూ.60 వేలు కట్టలేరా? వైద్యవిద్య అంటే ఆషామాషీ అనుకున్నారా? అంటూ ప్రిన్సిపల్ దబాయించినట్టు విద్యార్థినులు తెలిపారు.
ఫీజు కట్టలేదా.. రోజుకు రూ.100 ఫైన్!
Published Wed, Oct 19 2016 9:19 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేంద్ర బలగాల అండ..
ఆడపడుచులకు అండగా ఉంటాం..
కాంగ్రెస్లోకి మధిర మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు
ఖమ్మం బస్టాండ్లో వడదెబ్బతో సొమ్మసిల్లిన మహిళ
తెలుగు అధ్యాపకుడికి డాక్టరేట్
ఘనంగా కేవీకే స్వర్ణోత్సవాలు
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement