హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ సమావేశాల్లోని చివరి రోజు ప్రతిష్టంభన నెలకొంది. దేశంలో సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కుంభకోణం వ్యవహారం ఈ ప్రతిష్టంభనకు కారణమైనట్లు తెలుస్తోంది. వాస్తవానికి కేవలం ఐదు రోజులు మాత్రమే శాసన సభ సమావేశాలు జరపాలని ఏపీ సర్కార్ నిర్ణయించిన విషయం తెలిసిందే. కానీ, ఈ ఐదు రోజుల్లో ఏనాడు కూడా ప్రభుత్వం ప్రతి పక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పిన పరిస్థితి కనిపించలేదు.
ఆఖరికి చివరి రోజు కూడా బాధ్యతా రహితంగానే ప్రభుత్వం వ్యవహరించినట్లు ప్రతిపక్ష సభ్యులు ఆగ్రమం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత కీలకమైన ఓటుకు కోటు కేసుపై చర్చ జరగాలని దీనిపై చంద్రబాబునాయుడు సమాధానం చెప్పాలని ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. దీంతో మొత్తం రెండుసార్లు సమావేశం వాయిదా పడింది. ఇందులో రెండోసారి పదినిమిషాలు వాయిదా అని చెప్పిన స్పీకర్ కోడెల శివప్రసాద్.. రెండున్నర గంటల తర్వాతగానీ సమావేశం తిరిగి ప్రారంభించలేకపోయారు. ప్రారంభించిన కొన్ని క్షణాల్లోనే నిరవదిక వాయిదా వేశారు.
ఫలితంగా పలువురు నేతలు పది నిమిషాలు అంటే రెండున్నర గంటలని అర్ధమా అని ప్రశ్నిస్తున్నారు. తాము లాబీల్లో టీలు, కాఫీలు తాగేందుకు రాలేదని, ప్రజాసమస్యలపై చర్చించేందుకు వచ్చామని అన్నారు. ఓ వ్యక్తికి(ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు) సంబంధించిన అంశాన్ని(ఓటుకు కోట్లు) మొత్తం రాష్ట్ర ప్రజానీకానికి అంటగట్టి సమాధానం చెప్పకుండా తప్పించుకోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా, ఏ అంశంపై చర్చ లేవనెత్తారో ఆ చర్చకు సంబంధించిన వ్యక్తి(ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు) చివరి రోజు అసలు సభలోనే అడుగుపెట్టకుండా కేవలం ఛాంబర్కే పరిమితమవడం ఆయన బాధ్యత రాహిత్యానికి నిదర్శనం అని పెదవివిరుస్తున్నారు.
చివరకు రెండున్నరగంటల అనంతరం సమావేశం ప్రారంభమైన తర్వాత కూడా ప్రతిపక్షం లేవనెత్తిన అంశానికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయకుండానే స్పీకర్ నేరుగా అసెంబ్లీని నిరవధిక వాయిదా వేయడం చూస్తుంటే ఆయన ఏకపక్షంగా వ్యవహరించారని స్పష్టమవుతోందని అభిప్రాయపడ్డారు. సభా గౌరవాన్ని కాపాడాల్సిన స్పీకర్ తమ మనోభావాలను కించపరిచినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు చేసినందువల్లే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఓటుకు కోట్లు కేసులో సమాధానం చెప్పకుండా తప్పించుకొని సభను నిరవదిక వాయిదా వేయించారని ఆరోపించారు.
'పది నిమిషాలంటే.. రెండున్నర గంటలా'
Published Fri, Sep 4 2015 1:22 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement