సీఎం కేసీఆర్ స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: అటవీ ప్రాంతాల్లో గిరిజనులు, ఇతర సాంప్రదాయ వర్గాలు సాగు చేసుకుంటున్న భూములపై హక్కులు కల్పిస్తూ జారీ చేసిన ఆర్ఓఎఫ్ఆర్ (రికగ్నైజేషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్) పట్టాలు వాస్త వానికి భూమి పట్టాలు కావని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. సుప్రీం తీర్పు, రాజ్యాం గం, అటవీ చట్టాల ప్రకారం.. అటవీ భూములకు ఉన్నఫళంగా పట్టాలు జారీ చేయడం సాధ్యం కాదన్నా అటవీ భూమిని తీసుకుంటే అటవీ శాఖకు అంతే భూమిని ప్రత్యామ్నాయంగా కేటాయించాల్సి ఉంటుం దని.. ఆ భూమిలో అడవి పెంపకం కోసం ఎకరాకు రూ.6 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కానీ అడవులను నరికి సాగు చేసుకుంటే ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు వస్తాయన్న దురభిప్రాయంతో కొందరు ఇంకా చెట్లను నరుక్కుంటూ పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
దీనిపై కొంత గందర గోళం నెలకొని ఉందని, అటవీ భూములకు పట్టాలపై త్వరలో ప్రభుత్వం నుంచి స్పష్టత తీసు కొస్తామని వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం అంశంపై శుక్ర వారం శాసనసభలో జరిగిన చర్చలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఈ అంశాన్ని లేవనెత్తారు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు వస్తాయని కొందరు మభ్యపెడుతుండడంతో అమాయక గిరిజనులు అడవులను నరికి సాగు చేసుకుంటున్నారని, దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు. దీనిపై సీఎం కేసీఆర్ స్పందిస్తూ.. వీరయ్య అభిప్రాయంతో ఏకీభవిస్తున్నట్లు చెప్పారు. గందరగోళాన్ని దూరం చేసేందుకు చర్యలు తీసుకుంటామ న్నారు. రాష్ట్రంలో రికార్డుల ప్రకారం 25 శాతం అటవీ భూములు ఉండాలని.. కానీ 10 శాతం వరకు మాత్రమే అడవులు మిగిలాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా అడవులు కుచించుకుపోతే పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని చెప్పారు. రాష్ట్రంలో అటవీ భూముల అన్యాక్రాంతంపై వచ్చే బడ్జెట్ సమావేశాల్లో వివరాలు ఇస్తామన్నారు.
యాదాద్రి విద్యుత్ ప్లాంట్ భూములూ కబ్జా
నల్లగొండ జిల్లాలో యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణం కోసం సేకరించిన అటవీ భూములు సైతం కబ్జాకు గురయ్యాయని... అక్కడికి వెళ్లి చూస్తే పంటలు సాగు చేసుకుం టున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ అటవీ భూముల కోసం కేంద్రానికి ప్రత్యామ్నాయ భూములు, ఎకరాకు రూ.6 లక్షల చొప్పున అటవీ అభివృద్ధి నిధులను చెల్లించినప్పటికీ అక్కడ పనులు చేసే పరిస్థితి లేదన్నారు. ఆ భూమి కోసం వెళ్తే అక్కడ జనం ఉన్నారని, కరెంటు మోటార్లు, పంటలు ఉన్నాయని.. కబ్జాలు చేసిన వాళ్లే ధర్నాలు చేస్తున్నారన్నారు.
‘అటవీ’ పట్టాలతో భూ హక్కులు రావు!
Published Sat, Jan 7 2017 3:00 AM
Advertisement
Advertisement
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
పోలీసులతో నివేదా పేతురాజ్ వాగ్వాదం.. అసలు విషయం ఇదన్నమాట!
ఈపీఎఫ్ కొత్త రూల్స్.. వాటి అప్లోడ్ తప్పనిసరి కాదు!
తెలంగాణ తేజం పాటను ఆవిష్కరించిన కేసీఆర్.. నెట్టింట వైరల్
ఐదేళ్ల వయసులోనే అబ్బురపరిచే ప్రతిభ.. అరుదైన ఘనత
ఎగ్జిట్ పోల్స్పై ఈసీ కీలక ఆదేశాలు
గొర్రెల స్కాం.. పశుసంవర్ధక శాఖ సీఈవో రాంచందర్ అరెస్ట్
రాజమండ్రిలో దివ్యాంగులకు నాట్స్ చేయూత
అనంతపురంలో నాట్స్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ల పంపిణీ
రేపే చివరి విడత పోలింగ్
జాన్వీ కపూర్ వీడియోపై కామెంట్.. ఇచ్చిపడేసిన హీరోయిన్!
తప్పక చదవండి
- ఈపీఎఫ్ కొత్త రూల్స్.. వాటి అప్లోడ్ తప్పనిసరి కాదు!
- ముఖానికి రాసుకునే అలోవెరాతో బ్యాటరీ సెల్స్ !
- T20 WC 2024: ఇరవై జట్లు.. ఆటగాళ్ల లిస్టు.. పూర్తి వివరాలు
- Delhi water crisis: చేతులు జోడించి కోరుతున్నా.. సీఎం కేజ్రీవాల్
- T20 WC: ఎట్టకేలకు అమెరికాకు బయలు దేరిన విరాట్ కోహ్లి..
- సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- సెఫాలజిస్ట్ యోగేంద్ర ప్రెడిక్షన్... శశిథరూర్ ఆసక్తికర కామెంట్స్
- HYD: నాంపల్లిలో అర్ధరాత్రి హైడ్రామా.. ఏసీబీ అదుపులో ఈఈ, ఏఈలు..
- TRUMP: ‘హష్ మనీ’ కేసు.. ట్రంప్ను దోషిగా తేల్చిన కోర్టు
- T20 WC: మొత్తం షెడ్యూల్, సమయం, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు
Advertisement