ఏలూరు సిటీ: రాష్ట్ర విద్యాశాఖామంత్రి గంటా శ్రీనివాసరావు ఫ్యాప్టో నాయకత్వానికి ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు దశలవారీ పోరాటాలకు సిద్ధపడుతున్నట్టు ఫ్యాప్టో నాయకులు స్పష్టం చేశారు. స్థానిక యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి షేక్ సాబ్జీ మాట్లాడుతూ ఈ నెల 30, 31 తేదీల్లో తాలూకా కేంద్రాల్లో, ఫిబ్రవరి 13న జిల్లా కేంద్రంలో, 27న విజయవాడలో ధర్నాలు నిర్వహిస్తామని చెప్పారు. ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీస్ రూల్స్ పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యదర్శిని నియమించి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి రాష్ట్రపతి సవరణ ఉత్తర్వులు సాధించాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న ఎంఈవో, డీవైఈవో, డైట్ లెక్చరర్స్, జేఎల్ పోస్టులలో అర్హులైన ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. స్పెషల్ టీచర్లకు సర్వీసు కాలానికి నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని, సర్ప్లస్ ఉపాధ్యాయుల సర్దుబాటు ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ప్రత్యేక డీఎస్ఈ నిర్వహించాలని, ఎయిడెడ్ టీచర్లకు పదోన్నతులు, ఆరోగ్యకార్డులు మంజూరు చేయాలని కోరారు. మున్సిపల్ ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ను సవరించి జీపీఎఫ్, ఎల్టీసీ సౌకర్యం కల్పించాలని కోరారు. ఉర్దూ మీడియం స్కూళ్లలో జరిగే పరీక్షలకు ఉర్దూ మీడియంలోనే ప్రశ్నపత్రాలు సరఫరా చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఈడే శివశంకర్, డి.లింగేశ్వరరావు, జి.సాయిశ్రీనివాస్, కేవీ అప్పారావు, సీహెచ్ అనిల్బాబు, ఎండీ జిక్రియ పాల్గొన్నారు.
ఉపాధ్యాయ సమస్యలపై దశలవారీ పోరాటాలు
Published Tue, Jan 17 2017 8:54 PM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
భారత్లో మరో జర్మన్ బ్రాండ్ కారు లాంచ్.. ధర ఎంతో తెలుసా?
జూన్ 1 నుంచి డ్రైవింగ్ లెసెన్స్లు జారీ చేయనున్న ప్రైవేట్ కంపెనీలు
రెండు ఓటీటీల్లో 'కల్కి'.. ఏకంగా అన్ని కోట్లకు అమ్మేశారా?
వాళ్లందరూ పాకిస్థానీయులేనా.. అమిత్ షాపై కేజ్రీవాల్ ఫైర్
IPL 2024: ఫైనల్ చేరడమే మిగిలింది: కమిన్స్ పోస్ట్ వైరల్
అలసిన దేహానికో'టీ'..! భారత్లో మొదటిసారిగా..
రైతులూ ఆందోళనొద్దు.. సన్న బియ్యానికే 500 బోనస్ అనలేదు: డిప్యూటీ సీఎం భట్టి
బ్యాంక్ ఖాతాదారులకు ఎస్బీఐ అలెర్ట్
అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?
శ్రీలంకలో స్టార్లింక్ సేవలకై చర్చ
తప్పక చదవండి
- కెనడాలో భారతీయ విద్యార్థుల నిరసన.. ఎందుకంటే?
- Allu Arjun: ఊహించని ప్లేసులో కనిపించిన అల్లు అర్జున్.. ఫొటో వైరల్
- కొన్ని గంటల్లోనే నిర్ణయం వెనక్కి తీసుకున్న బీఐఏఎల్
- T20: ఆస్ట్రేలియా ప్రపంచకప్ జట్టులో కొత్తగా ఇద్దరు.. స్మిత్కు మరోసారి!
- 'ఫ్యామిలీస్టార్'ను వాళ్లు కావాలనే టార్గెట్ చేశారు: ఆనంద్
- బరువు తగ్గాలనుకుంటే..ఆ ఆహారాలకు దూరంగా ఉండాలంటున్న నిపుణులు!
- తెలంగాణ డీజీపీ పేరుతో వ్యాపారవేత్త కూతురికి బెదిరింపులు
- MI: ఈ సీజన్లో నిరాశే మిగిలింది: నీతా అంబానీ వ్యాఖ్యలు వైరల్
- AP: అంతా ప్రీ ప్లాన్డ్గానే.. సిట్ నివేదికలో సంచలన విషయాలు!
- ఐదో దశ ఓటింగ్పై ఎన్నికల సంఘం ఆందోళన?
Advertisement