తండ్రి, కుమారుడు దుర్మరణం | Sakshi
Sakshi News home page

తండ్రి, కుమారుడు దుర్మరణం

Published Mon, Feb 27 2017 12:55 AM

father and son died

సంజామల: రోడ్డు ప్రమాదంలో తండ్రి, కుమారుడు మృతిచెందారు. ఈ ఘటన అక్కంపల్లె గ్రామ సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు మండలం మోరగుడి గ్రామానికి చెందిన సింగనమల తిరుపాలయ్య(45) వ్యాపార నిమిత్తం ఐదేళ్ల క్రితం కర్నూలులో స్థిరపడ్డాడు. కర్నూలులో దుస్తుల  వ్యాపారం చేసేవారు. స్వగ్రామమైన మోరగుడిలో చేనేతలు పట్టు చీరలు నేస్తారు. తిరుపాలయ్య ఇక్కడి నుంచి పట్టు చీరలు కొని కర్నూలులోని తన దుకాణంలో అమ్మేవాడు. తన కుమారుడు చైతన్య(17)తో కలిసి స్కూటీలో ఆదివారం ఉదయం బయలు దేరి మోరగుడికి బయలు దేరారు. అక్కడ చీరలకు ఆర్డర్‌ ఇచ్చి  మధ్యాహ్నం కర్నూలుకు తిరిగి వస్తుండా.. అక్కంపల్లె గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న జేసీబీ వీరు ప్రయాణిస్తున్న స్కూటీని ఢీ కొంది. దీంతో తండ్రి, కుమారుడు అక్కడికక్కడే మృత్యవాతపడ్డారు. మృతుడు తిరుపాలయ్యకు భార్య, కూతురు ఉన్నారు. కర్నూలు నుంచి మోరగుడికి సుమారు 150 కిలోమీట్ల దూరం ఉంది. వీరు స్కూటీలో అంతదూరం ప్రయాణించడం అంత క్షేమకరం కాదనే వాదన వినిపించింది. సంజామల ఎస్‌ఐ విజయభాస్కర్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement