- లేబొరేటరీ పనులను అడ్డుకున్న రైతులు
- నిర్మాణ సామగ్రి దహనం.. పెద్ద ఎత్తున నినాదాలు
- రైతుల ఆందోళనకు అండగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాజా
తొండంగి
తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం కోన తీరప్రాంతంలో దివీస్ లేబొరేటరీస్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పరిసర గ్రామాల రైతులు ఆ భూముల్లోకి ఆదివారం ప్రవేశించి పనులను అడ్డుకున్నారు. దానవాయిపేట పంచాయతీ కొత్తపాకలు గ్రామంలో ప్రభుత్వం దివీస్ లేబొరేటరీస్కు 505 ఎకరాలు కేటాయించింది. ఇటీవల రెవెన్యూ అధికారులు ఎకరాకు రూ.5 లక్షల పరిహారం చెల్లించి కొంతమంది రైతుల నుంచి భూములు సేకరించారు. అయితే ఈ పరిశ్రమ వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని, గాలి, నీరు, నేల కలుషితమై తీరప్రాంత గ్రామాల మనుగడ దెబ్బ తింటుందని పేర్కొంటూ.. పంపాదిపేట, కొత్తపాకలు, తాటియాకులపాలెం తదితర గ్రామాల రైతులు భూములిచ్చేది లేదంటూ తీవ్రంగా వ్యతిరేకించారు. సమస్యను తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా దృష్టికి తీసుకువెళ్లి తమకు న్యాయం చేయాలని కోరగా పంపాదిపేటలో బాధిత రైతులతో ఎమ్మెల్యే ఆదివారం చర్చించారు.
దివీస్ సేకరించిన భూముల్లో క్లియరింగ్ పనులు రెండు రోజుల క్రితం ప్రారంభమయ్యాయని రైతులు వివరించారు. అక్కడున్న మహిళలు, రైతులతో కలిసి ఎమ్మెల్యే రాజా పాదయాత్రగా పరిశ్రమకు సేకరించిన భూముల పరిశీలనకు వెళ్లారు. తాటియాకులపాలేనికి చెందిన రైతు ఎన్.నాగేశ్వరరావు భూమిలో దివీస్ ప్రతినిధులు బలవంతంగా పనులు నిర్వహిస్తున్నారని గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆగ్రహానికి గురైన రైతులు తమపై బలప్రయోగానికి దిగితే ఊరుకునేది లేదని హెచ్చరిస్తూ.. అక్కడ షెడ్డు నిర్మించేందుకు వేసిన స్తంభాలను, తాటిదూలాలను తొలగించారు. తాటియాకులను తగలబెట్టి నిరసన తెలిపారు. పరిశ్రమ నిర్మాణ పనులు సాగనివ్వబోమని నినాదాలు చేశారు.
రైతులకు అండగా వైఎస్సార్సీపీ: ఎమ్మెల్యే రాజా
కాకినాడ సెజ్ ప్రాంతంలో సేకరించిన భూములు ఖాళీగా ఉండగా.. పేద రైతుల భూములను తక్కువ ధరకు బలవంతంగా సేకరించడం అన్యాయం. సెజ్ ప్రాంతంలో పరిశ్రమను స్థాపిస్తే ఎకరాకు రూ.70 లక్షల చొప్పున దాదాపు రూ. 350 కోట్లు అవుతుందని, కానీ, కోన ప్రాంతంలోని పేద రైతుల భూములను రూ. 25 కోట్లకే చేజిక్కించుకునేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. ఎన్నో ఏళ్లుగా భూమినే నమ్ముకుని బతుకుతున్న తీరప్రాంత రైతులంతా పరిశ్రమ స్థాపనతో వచ్చే కాలుష్యం వల్ల వలస పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ ప్రాంత ప్రజల మనుగడను ప్రశ్నార్థకం చేసే దివీస్ పరిశ్రమ స్థాపనను ప్రభుత్వం విరమించుకునే వరకూ ఎమ్మెల్యేగా, వైఎస్సార్సీపీ నేతగా ప్రజల పక్షాన పోరాడతాను.
‘దివీస్’ భగభగలు
Published Mon, Aug 29 2016 3:25 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
'ఛీ, నీ బతుకు'.. చురకలంటించిన కలర్స్ స్వాతి
12 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్
జగనన్న పాలనతో పెత్తందార్ల కడుపు మండుతోంది: నాగార్జున యాదవ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
తప్పక చదవండి
- 100 మందికే అనుమతి.. పశ్చిమ బెంగాల్ రాజభవన్ కీలక ప్రకటన
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement