వైఎస్సార్‌సీపీలో చేరిన ముగ్గురిపై దాడి | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో చేరిన ముగ్గురిపై దాడి

Published Mon, Jan 23 2017 12:05 AM

attacks on ysrcp leaders

హిందూపురం అర్బన్‌ : పరిగి మండలం శాసనకోటకు చెందిన టీడీపీ కార్యకర్తలు నారాయణస్వామి, నాగరాజు, నిర్మల వారం రోజుల కిందట వైఎస్సార్‌సీపీలో చేరారు. దీన్ని జీర్ణించుకోలేని టీడీపీ నాయకులు రామకృష్ణ, శివన్న, నరసింహప్ప, సిద్దమ్మలు ఆదివారం సాయంత్రం అకారణంగా గొడవ పెట్టుకున్నారు. ఇంట్లోకి దూసుకొచ్చి కత్తితో దాడి చేయడంతో నారాయణస్వామి తీవ్రంగా గాయపడ్డాడు. నాగరాజును ఇష్టానుసారం కొట్టడంతో ఎడమ కన్ను వాచిపోయింది.

అడ్డుకోవడానికి వెళ్లిన నిర్మలమ్మను కొట్టడంతో ఆమెకూ బలమైన గాయాలయ్యాయి. బాధితులను బంధువులు హుటాహుటిన హిందూపురం ఆస్పత్రిలో చేర్పించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు. గాయపడిన వారిని వైఎస్సార్‌సీపీ జిల్లా అ««ధ్యక్షులు శంకరనారాయణ పరామర్శించారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడిచేసిన వారిపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Advertisement
Advertisement