డెంగ్యూతో యువకుడు మృతి | Sakshi
Sakshi News home page

డెంగ్యూతో యువకుడు మృతి

Published Tue, Sep 1 2015 8:11 PM

Youth dies of Dengue

వైఎస్సార్ జిల్లా : వైఎస్సార్ జిల్లాలో ఓ యువకుడు డెంగ్యూ జ్వరంతో మృతి చెందాడు. జిల్లా కేంద్రం కడపకు చెందిన పుల్లయ్య, లక్ష్మీదేవి దంపతుల కుమారుడు శివ(20) నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. అప్పటి నుంచి తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడు.. పరిస్థితి విషమించి మంగళవారం సాయంత్రం కన్నుమూశాడు. డిగ్రీ చదువుతున్న శివ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. అతని మృతితో తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు.

Advertisement
Advertisement