బస్సులో వివాహితపై లైంగిక వేధింపులు | Sakshi
Sakshi News home page

బస్సులో వివాహితపై లైంగిక వేధింపులు

Published Thu, Apr 24 2014 9:30 AM

బస్సులో వివాహితపై లైంగిక వేధింపులు - Sakshi

అనంతపురం జిల్లా కదిరిలో బుధవారం దారుణం చోటు చేసుకుంది. ప్రొద్దుటూరు నుంచి బెంగళూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో వివాహితపై ఓ ప్రయాణికుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దాంతో సదరు మహిళ పక్కనే ఉన్న భర్తకు విషయం వెల్లడించింది. మహిళ భర్త వెంటనే బస్సు ఆపి... ప్రయాణికులతోపాటు మహిళ భర్త నిందితుడికి దేహశుద్ది చేశారు. అనంతరం నిందితుడిని కదిరి పోలీసు స్టేషన్కు తరలించారు. నిందితుడిపై పోలీసులు నిర్బయ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement