కొత్తపేట(గుంటూరు): జిల్లాలో జల గండం పొంచి ఉంది. భూగర్భ జలాలు గణనీయంగా అడుగంటి పోవడమే ఇందుకు కారణం. తీవ్ర వర్షాభావం కారణంగా కుంటలు, చెరువులు ఎండిపోవటంతో పరిస్థితి ఆందోళనకరంగా తయూరైందని నిపుణులు చెబుతున్నారు. పల్నాడు ప్రాంతంతోపాటు గుంటూరు నగరంలోనూ భూగర్భ జల మట్టం బాగా పడిపోరుుంది. గత నెలలో జిల్లా సగటు భూగర్భ జల మట్టం -6.663 మీటర్లుగా నమోదైంది.
భూగర్భ జలాలు అడుగంటడంతో జిల్లా వ్యాప్తంగా ప్రజలు నీటి ఎద్దడి సమస్యను ఎదుర్కొంటున్నారు. తీవ్ర వర్షాభావం, అశాస్త్రీయ పట్టణీకరణ ఈ సమస్యకు ప్రధాన కారణాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.పల్నాడు ప్రాంతంలోని దుర్గి, వె ల్దుర్తి, మాచర్ల, బొల్లాపల్లి మండలాల్లో 300 మీటర్ల లోతు వరకు వెళ్లినా నీటి జాడ కనిపించడం లేదు.
గుంటూరులోని గుజ్జనగుండ్ల, చంద్రమౌళినగర్, విద్యానగర్, లక్ష్మీపురం, కొరిటెపాడు ప్రాంతాల్లో భూగర్భ జలాలు తగ్గటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంతాల్లోని భారీ అపార్ట్మెంట్లలో 600 నుంచి వెరుు్య అడుగుల లోతు వరకు బోర్లు తవ్వటం వల్ల పరిస్థితి ప్రమాదకరంగా తయూరైంది.
ఇవీ లెక్కలు
జిల్లాలోని భూగర్భ జల మట్టాలను అధికారులు నెలకొకసారి 125 పిజోమీటర్ల ద్వారా పరిశీలించి వివరాలు నమోదు చేస్తుంటారు. వీటి ప్రకారం ఈ ఏడాది మే నెలలో తెనాలి డివిజన్లో 4.59 మీటర్లు, నరసరావుపేట డివిజన్లో 6.45 మీటర్లు, గుంటూరు డివిజన్లో 14.59 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉన్నారుు. 2012లో జిల్లా సగటు భూగర్భ జలమట్టం -6.910 మీటర్లు కాగా 2013లో-7.838 మీటర్లు, ఈ ఏడాది జూన్ నాటికి -6.663 మీటర్లుగా నమోదైంది.
దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి...
పరిస్థితి మరింత దిగజారకుండా చూసేందుకు అధికారులు దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో భాగంగా అపార్లమెంట్లలో భారీ బోర్ల తవ్వకాన్ని నిరోధించాలని, ఇంకుడు గుంతల తవ్వకాన్ని తప్పనిసరి చేయూలని పేర్కొంటున్నారు.
జల గండం
Published Wed, Jul 30 2014 12:10 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోమ్ ఓటింగ్ ప్రక్రియ వేగవంతం చేయండి
మోదీని ఆపే దమ్ము కేసీఆర్కే ఉంది
కాలవ అండ .. కరిగిన కొండ!
వైఎస్ జగన్తోనే సంక్షేమం
ప్రమాదంలో ఒకరి మృతి
ఐస్క్రీం తిని 100 మందికి అస్వస్థత
పాండవపురలోనూ అబార్షన్ దందా
స్టీరింగ్ విరిగి.. వరి మడిలోకి
కస్టడీలో రేవణ్ణ విచారణ
వీడియో బాధితుల కోసం సిట్ సహాయవాణి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement