రెండు ఆర్టీసీ బస్సులు ఢీ | Sakshi
Sakshi News home page

రెండు ఆర్టీసీ బస్సులు ఢీ

Published Sat, Apr 18 2015 9:12 AM

two RTC busses crash in kurnool

కర్నూలు: ఎదురెదురుగా వస్తున్న రెండు ఆర్టీసీ బస్సులుఢీ కొన్నాయి. ఈ ఘటనలో డ్రైవర్‌కు తీవ్రగాయాలు కాగా, కొంత మంది ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి. ఈ సంఘటన శనివారం తెల్లవారుజామున కర్నూలు జిల్లా తాండ్రపాడులో జరిగింది.

వివరాలు..తిరుపతి నుంచి కర్నూలు, కర్నూలు నుంచి కడప వెళ్తున్న రెండు బస్సులు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో గాయపడిన డ్రైవర్‌ను మెరుగైన వైద్యం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. స్వల్పగాయాలైన ప్రయాణికులు ప్రాథమిక చికిత్స చేయించుకొని వెళ్లిపోయినట్లు సమాచారం.

Advertisement

తప్పక చదవండి

Advertisement