విజయనగరంఫోర్ట్: రబీ సీజన్ ఆరంభమైంది. కొంతమంది రైతులు ఇప్పటకే విత్తనాలు కొనుగోలు చేశారు. మరి కొంతమంది ఇంకా కొనుగోలు చేయాల్సి ఉంది. విత్తనాలు నాణ్యతపైనే పంట దిగుబడి అధారపడి ఉంటుంది. విత్తనాల కొనుగోలులో జాగ్రత్తలు పాటించకపోతే నష్ట పోవలసి వస్తుందని వ్యవసాయశాఖ సహాయసంచాలకులు ఎ.నాగభూషణరావు తెలిపారు. విత్తనాలు సేకరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ఆయన వివరించారు. గత 5, 6 సంవత్సరాల్లో పత్తి, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న, మిర్చి , కాయగూరల్లో ప్రైవేటు విత్తన ఉత్పత్తి సంస్థలు అనేక రకాలను మార్కెట్లోకి విడుదల చేశాయి. అయితే వాటిని సాగుచేసినప్పుడు ఆయా సంస్థలు ప్రకటించిన దిగుబడి కన్నా తక్కువ దిగుబడి రావడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి విత్తనాలను కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి.
నోటిఫైడ్, నాన్ నోటిఫైడ్ విత్తనాల తేడా: విత్తనాలలో ప్రభుత్వ పరంగా విడుదలయ్యేవి, ప్రైవేటుపరంగా విడదలయ్యేవి ఉంటాయి. ప్రభుత్వపరంగా రూపొందించిన రకాలు నోటిఫైడ్ పేరిట మార్కెట్లోకి వస్తాయి. ప్రైవేటు సంస్థలు రూపొందించిన విత్తనాలను నాన్ నోటిఫైడ్ పేరిట విడుదల చేస్తారు.
నోటిఫైడ్ విత్తనాల నాణ్యత, పంపిణీ ప్రమాణాలు మొదలైనవి 1966 నాటి విత్తన చట్టం, 1983 నాటి విత్తన నియంత్రణ పరిధిలోకివస్తాయి. విత్తనాలు నాణ్యతాప్రమాణాలకు అనుణంగా లేటనట్లయితే ఉత్పత్తిదారులు, పంపిణీ దారులు చట్టరీత్యా శిక్షార్హులు.
విత్తనాలు కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు: మండల వ్యవసాయఅధికారి లేదా సంబంధిత వ్యవసాయ సహాయ సంచాలకుల సలహా మేరకు ఆయా ప్రాంతాలకు అనువైన నోటిఫైడ్ లేదా నాన్ నోటిఫైడ్ రకాలను కొనుగోలు చేయాలి.
ప్రైవేటు కంపెనీలు ప్రచురించిన ఆకర్షణీయమైన కరపత్రాలను నమ్మకూడదు. ఆయా రకాలను వ్యవసాయ విశ్వ విద్యాలయం వారు ప్రయోగత్మకంగా సాగుచేసినప్పుడు సత్ఫలితాలు వస్తే ప్రభుత్వం వాటిని ఎంపిక చేసుకోవాలి.
వ్యవసాయశాఖ జారీ చేసిన లెసైన్సు ఉన్నవారి నుంచి మాత్రమే విత్తనాలను కొనుగోలుచేయాలి. లెసైన్సు లేకుండా , బిల్లులు ఇవ్వకుండా తక్కువ ధరలతో, నాణ్యత లేని విత్తనాలను అమ్మడానికి కొన్ని ప్రైవేటు కంపెనీలు ప్రయత్నిస్తుంటాయి. వాటి పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి.
సంబంధిత అధీకృత డీలరు వద్దే విత్తనాలు కొనుగోలు చేయాలే తప్ప ఇతరులు వద్ద కొనుగోలు చేయకూడదు. ఎలాంటి అనుమానమున్నా వెంటనే నేరుగా జిల్లా సంయుక్త సంచాలకులు లేదా కమిషనర్ కార్యాలయానికి తెలియపర్చాలి.
కొనుగోలు చేసిన విత్తనాల ప్యాకెట్లను , వాటికి కుట్టిన లేబుళ్లను విత్తనాలను వినియోగించిన తరువాత భద్రపరచుకోవాలి. ఇవి మున్ముందు విత్తనాలకు సంబంధించిన నాణ్యత సమస్యలకు , పరిహారం పొందడానికి ముఖ్యమైన అధారంగా ఉంటాయి.
ఒక వేళ ఏదైనా విత్తనం, నాణ్యత ప్రమాణాలకు తగినట్టు లేకపోతే... అంటే తక్కువ మొలకశాతం, జన్యుస్వచ్ఛత లేకపోవడం, కల్తీ వంటి వాటిని గమనించినట్లుయితే సంబంధిత వ్యవసాయ అధికారికి తెలియజేయాలి. వారి సలహా మేరకు తదుపరి చర్య తీసుకోవాలి.
విత్తన కొనుగోలులో జాగ్రత్త అవసరం
Published Wed, Nov 25 2015 2:24 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
వైట్హౌస్కు ఏఐ టెక్నాలజీని పరిచయం చేసిన భారత సంతతి ఇంజనీర్! ఎవరీమె?
రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి
టీడీపీ కార్యకర్తల దాడి అంబటి స్ట్రాంగ్ కౌంటర్
పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు
పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)
కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్
తప్పక చదవండి
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement