కాకినాడ : ఆధ్యాత్మికతకు ఆటపట్టయిన ఆ ప్రాంతాన్ని రాసలీలకు కేంద్రంగా మార్చేశారు. ఆలయంలో ఒక ఉద్యోగి ఈ రాసలీల బాగోతానికి కేంద్ర బిందువు అయ్యాడు. స్థానికుల ద్వారా ఈ విషయం జిల్లా కేంద్రానికి చేరడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. ఐ.పోలవరం మండల ముఖద్వారమైన మురమళ్ల వీరేశ్వరస్వామి ఆలయ అతిథి గృహాన్ని ఒక ఉద్యోగి రాసలీలకు వేదికగా చేసుకున్నాడనే అంశం వెలుగు చూడడంతో ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. సుదూర ప్రాంతాల నుంచి ఆలయానికి వచ్చే భక్తుల విడిది కోసం ఆలయంలో నాలుగు గదులతో కూడిన అతిథిగృహం ఒకటి ఉంది. వీటిలో ఒక ఏసీ గది కూడా ఉంది.
మూడు రోజుల క్రితం స్వామి రాత్రి 11 గంటల సమయంలో ఆ మండలానికి చెందిన ఒక యువతి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మరొక యువతిని అతిథిగృహానికి తీసుకువచ్చింది. ఆలయంలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి ఏసీ గదిలో ఒక యువతితో రాసలీలు సాగించిన విషయం గుప్పుమంది. ఆలయ మాజీ ప్రతినిధి ఆ తరువాత రోజు ఉదయం ఆలయానికి వచ్చి ఆరా తీసినట్టు సమాచారం.
ఈ విషయాన్ని చివరకు ముమ్మిడివరం నియోజకవర్గ ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకు వెళ్లారు. యువతుల భవిష్యత్తు దృష్ట్యా ఈ వ్యవహారాన్ని గుట్టుచప్పుడు కాకుండా విడిచిపెట్టేయాలనే నిర్ణయానికి వచ్చారని సమాచారం. దీనికి బాధ్యుడైన ఉద్యోగిని మాత్రం బదిలీపై మరో ప్రాంతానికి పంపించేయాలని ఆ ప్రజాప్రతినిధి ఆదేశించారని తెలియవచ్చింది. ఆలయ సిబ్బందిపై పర్యవేక్షణ కొరవడటంతోనే ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు ఆస్కారం ఏర్పడిందని భక్తులు మండిపడుతున్నారు.
ఆధ్యాత్మిక కేంద్రంలో రాసలీలలా...!
Published Fri, Aug 22 2014 11:09 AM
Advertisement
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
పల్నాడు జిల్లాలో రెచ్చిపోయిన టీడీపీ మూకలు
ఓటు వేయకపోతే ఆ దేశాల్లో ఎలాంటి శిక్షలు విధిస్తారో తెలుసా!
గౌతమ్ సింఘానియా రూ.5.91 కోట్ల కారు ఇదే!
చీరలో ముద్దుముద్దుగా జాన్వీ.. లుక్ మార్చేసిన సీరియల్ బ్యూటీ!
హాట్టాపిక్గా ప్రిన్స్ హ్యారీ భార్య మేఘన్ మార్క్లే గౌను!
న్యూ ఇయర్ను మించిన మదర్స్ డే! ఎలాగో చూడండి..
Actors And Their Polling Booths: టాలీవుడ్ హీరోలు ఓటేసేది ఇక్కడే (ఫోటోలు)
కేజీ కుంకుమపువ్వు రూ.4.95 లక్షలు - ఎందుకింత రేటు తెలుసా?
ముట్టుకుంటే రూ.20 లక్షలు.. ఫొటోకి రూ.25 లక్షలు
రేపే లోక్సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్.. అంతా రెడీ
తప్పక చదవండి
- నాయకుల గెలుపులో.. ప్రజలదే తుది నిర్ణయం!
- పెత్తందారుల వెన్నులో వణకు తెప్పిస్తున్న కొత్తతరం..!
- నాడు చెప్పుతో కొట్టి.. నేడు ‘కాపు’ కాస్తానంటూ కాకమ్మ కబుర్లు!
- నాడు చదువులు ఉత్త మిథ్య.. నేడు జీవితకాల భరోసా!
- బాబు షాక్కు.. జగన్ ట్రీట్మెంట్
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- పవన్ వ్యూహానికి వంగా గీత కౌంటర్ వ్యూహమిదే..!
- సీఎం వైఎస్ జగన్ చేయూత.. పారిశ్రామికవేత్తలుగా మహిళలు
- RRRకి కమ్మటి దెబ్బ.. పరువు తీసేసిన బీజేపీ!
- దారి తప్పిన మేధావి.. ఎందుకీ మార్పు?
Advertisement