► నియోజకవర్గ ఇన్చార్జ్తో కుదరని సమోధ్య
► మంత్రులకు ఫిర్యాదు
► రాజీ అంటే పార్టీ నుంచిబయటకే అంటూ హెచ్చరిక
► సీఎం వద్ద పంచాయితీ చేస్తామని బుజ్జగింపు
► టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అభివృద్ధి కోసమంటూ ఇటీవలే పార్టీ మారిన ఎమ్మెల్యే అతను. అయితే ఆ నియోజకవర్గంలో టీడీపీ ఇన్చార్జ్కు అతనికి పొసగలేదు. పలు మార్లు వారు బహిరంగంగానే విమర్శలు దిగారు. ఈ నేపథ్యంలో పార్టీలో ఇమడలేక వలసనేత ఎదురీదాల్సి వస్తోంది. ఆదివారం కర్నూలులో నిర్వహించిన సమావేశంలో తన ఆవేదనను మంత్రుల ఎదుట వెళ్లగక్కారు. ‘‘ఆయనతో రాజీ అంటే నేను ఒప్పుకునేదే లేదు. అవసరమైతే పార్టీ నుంచి బయటకైనా వెళతాను కానీ కలిసి పనిచేసే ప్రశ్నేలేదు.
ఆయన, ఆయన కుమారుడిపై పెట్టిన ఎస్సీ, ఎస్టీ కేసు వ్యవహారంలో నా ప్రమేయం లేదు. వేరే వాళ్లు పెట్టారు’’ అని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, జిల్లా ఇన్చార్జీ మంత్రి అచ్చెన్నాయుడుల సమక్షంలో పార్టీ మారిన ఓ ఎమ్మెల్యే ఖరాఖండిగా తేల్చిచెప్పారు. మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యే ఏ మాత్రం సమన్వయం లేకుండా ఇంకా ప్రతిపక్షంగానే వ్యవహరిస్తున్నారని మరో నేత ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మంత్రులు జోక్యం చేసుకుని.. ముఖ్యమంత్రి సమక్షంలో పంచాయితీ చేస్తామని ఇరువురి నేతలను బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఇరువురి నేతలు మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా సమావేశం నుంచి వెళ్లిపోయారు. పార్టీలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీలతో పాటు జిల్లా అధికారులతో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, మంత్రి అచ్చెన్నాయుడులు ప్రభుత్వ అతిథి గృహంలో ఆదివారం సమావేశం నిర్వహించారు.
గతం నుంచి పార్టీలో ఉన్న నేతలు, తాజాగా పార్టీలో చేరిన నేతల మధ్య సయోధ్య కుదర్చడంతో పాటు అధికారులు చెప్పిన పనులు చేసే విధంగా చేసేందుకు ఉద్దేశించిన సమావేశంలో సయోధ్య ఏ మాత్రమూ కుదరలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి. అయితే, అధికారులపై మాత్రం పార్టీ నేతలు చేసిన ఫిర్యాదులపై సదరు అధికారులను పిలిపించి చెప్పిన పనులు చేయాల్సిందేనని ఇన్చార్జీ మంత్రి గట్టిగా మందలించినట్టు తెలిసింది.
మాకు తెలియకుండానే బదిలీలా...!
ఈ సమావేశంలో ప్రధానంగా ఉద్యోగుల బదిలీలపైనా చర్చ జరిగినట్టు సమాచారం. విద్యుత్శాఖలో తమకు తెలియకుండానే ఇంజినీర్లను బదిలీ చేశారని దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్ధ (ఎస్పీడీసీఎల్) ఎస్ఈని పిలిచి నిలదీశారు. ప్రధానంగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కొద్ది మందిని మార్చాలని గంగుల ప్రభాకర్ రెడ్డి కోరినట్టు తెలిసింది. అదేవిధంగా కోడుమూరు నియోజకవర్గంలో తనకు తెలియకుండా కొంతమందిని మర్చారని పార్టీ ఇన్చార్జీ ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.
ఇక నంద్యాల నియోజకవర్గంలో అధికారులు మాట వినడం లేదని..ఆయన మాటలు వినాల్సిన అవసరం లేదని జిల్లా బాధ్యుడే చెబుతున్నారని ఇన్చార్జీ మంత్రి దృష్టికి ఇంకో నేత ఫిర్యాదు చేసినట్టు సమాచారం. అంతకు ముందు జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలోనూ ఇదే తరహాలో ఒకరికొకరు ఫిర్యాదు చేసుకున్నట్లు తెలిసింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ విజయమోహన్, జేసీ హరికిరణ్, ఎస్పీ రవికృష్ణతో పాటు అధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి, పార్టీ నేతలు బీసీ జనార్దన్ రెడ్డి, భూమా నాగిరెడ్డి, గంగుల ప్రభాకర్ రెడ్డి, విష్ణువర్దన్ రెడ్డి, మీనాక్షి నాయుడు, ఎస్వీ మోహన్ రెడ్డి, మణిగాంధీ, కేఈ ప్రతాప్, వీరభద్రగౌడు తదితరులు పాల్గొన్నారు. అయితే, ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం సోదరుడు, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ దూరంగా ఉన్నారు.
వలస నేత.. ఎదురీత!
Published Mon, Jun 27 2016 3:13 AM
Advertisement
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై టీడీపీ నేతల దాడి
నా ఓటు .. నా హక్కు (ఫొటోలు)
తడిచి మురిసిన ముంబై : భారీ గాలిదుమ్ముతో ఆగిన విమాన సేవలు
మామిడి పండ్లను తినడం వల్ల మొటిమలు వస్తాయా?
IPL: ధోనికి ఇదే చివరి సీజన్?!.. క్లారిటీ ఇచ్చేసిన రైనా
సమయం మించిపోతోంది.. రండి.. ఓటేయండి (ఫొటోలు)
మే 19కల్లా అండమాన్కు రుతుపవనాలు
నాన్నను బతికుండగానే కాలం చేయమని కోరా!: నటుడు
ఓటు హక్కు వినియోగించుకున్న యాంకర్ శ్యామల కుటుంబ సభ్యులు
పోలింగ్ బూతును పరిశీలించిన వైఎస్సార్సీపీ అభ్యర్థులు
తప్పక చదవండి
- మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
- బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
Advertisement