ఏలూరులో టీడీపీ కార్పొరేటర్ అరాచకం
ఏలూరు: ‘పింఛను ఇస్తామన్నారు. ఇంతవరకు ఇవ్వలేదయ్యూ. ఆ డబ్బులు ఇప్పించి కాస్త పుణ్యం కట్టుకోండయ్యూ..’ అని అడిగినందుకు ఓ వృద్ధుడి తలను కార్పొరేటర్, అతడి తల్లి, అనుచరుడు కలిసి సీసాతో పగులగొట్టిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో గురువారం సంచలనం కలిగించింది. ఏలూరు తూర్పువీధిలో నివసించే వృద్ధుడు తిరుమలశెట్టి రాజు కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. తనకు పింఛను రావటం లేదని గురువారం సాయంత్రం 10వ డివిజన్ కార్పొరేటర్ పోలిశెట్టి తులసీరామ్ ఇంటికి వెళ్లి మొరపెట్టుకున్నాడు. అతడిపై కార్పొరేటర్ ఆగ్రహంతో ఊగిపోతూ తిట్ల దండకం అందుకున్నాడు. ‘పింఛను అడగటానికి వస్తే తిడతారేంటి బాబూ..’ అని ఆ వృద్ధుడు అనడంతో మరింత ఆగ్రహించిన కార్పొరేటర్ అతడి గుండెలపై తన్నగా, అనుచరులు బరబరా ఈడ్చేశారు. సమీపంలో ఉన్న మద్యం సీసాను వృద్ధుడి తలపై మోదడంతో అతడికి తీవ్రగాయూలయ్యూరుు. చుట్టుపక్కల వారు వెంటనే అతడిని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
పింఛనడిగితే నేరమా
పింఛను పెంచారని తెలిసి సంబరపడ్డాను.అందితే తిండి దొరుకుతుందని ఆశపడ్డాను. ఆ మొత్తం పెంచలేదు సరికదా.. గతంలో ఇచ్చే రూ.200 కూడా ఇవ్వటం లేదు. ఏమైందో తెలుసుకుందామని కార్పొరేటర్ ఇంటికి వెళ్లాను. పింఛను ఇప్పించి ఆదుకోమని అడిగాను. అంతే కార్పొరేటర్ నన్ను గుండెలపై తన్నారు. పక్కనే ఉన్న ఆయన తల్లి, అనుచరులు నాపై దాడికి దిగారు. ముసలాడినని కూడా చూడకుండా కొడతారేంటని అడిగాను. కార్పొరేటర్ ప్రోద్బలంతో ఆయన అనుచరుడు నారాయణ నాతలపై మందు సీసాతో కొట్టాడు. దాడి చేయమని వాళ్ల నాయకుడు చెప్పాడా? నాకు పింఛను ఇప్పించి న్యాయం చేయండి..
- తిరుమలశెట్టి రాజు, బాధితుడు
నేను కొట్టలేదు
పింఛను రాలేదని ఆ వృద్ధుడు నా దగ్గరకు వచ్చాడు. సిబ్బంది లేరు తరువాత రమ్మని చెప్పాను. పక్కనే ఉన్న నారాయణ అనే వ్యక్తి ఆ వృద్ధుడిని వారించే ప్రయత్నం చేయగా అతణ్ణి తోసేశాడు. నేను మాత్రం వాడిని కొట్టలేదు. వారించిన నన్ను కాలర్ పట్టకోవడంతో స్థానికులు కలుగజేసుకుని బయటకు ఈడ్చుకెళ్లారు. మద్యం తాగి.. వెంట సీసా తెచ్చుకున్న ఆ వృద్ధుడు తన తలపై తానే సీసాతో కొట్టుకున్నాడు.
- తులసీరామ్, కార్పొరేటర్
పింఛను అడిగితే తల పగులగొట్టారు
Published Fri, Dec 19 2014 10:46 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
'ఛీ, నీ బతుకు'.. చురకలంటించిన కలర్స్ స్వాతి
12 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్
జగనన్న పాలనతో పెత్తందార్ల కడుపు మండుతోంది: నాగార్జున యాదవ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
తప్పక చదవండి
- వంద మందికే అనుమతి.. పశ్చిమ బెంగాల్ రాజభవన్ కీలక ప్రకటన
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement