లారీ ఢీకొని విద్యార్థి మృత్యువాత | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని విద్యార్థి మృత్యువాత

Published Mon, Nov 30 2015 10:29 AM

student died due to lorry accident

హిందూపురం: పాఠశాలకు వెళ్తున్న విద్యార్థి ప్రాణాలను మృత్యు రూపంలో వచ్చిన లారీ కబళించింది. అనంతపురం జిల్లా హిందూపురం మండలం చెలివెందల గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన నూర్‌బాబా(14) స్థానిక ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. అతడు సోమవారం ఉదయం స్కూలుకు వెళ్తుండగా వేగంగా వెనుక నుంచి వచ్చిన లారీ అతనిపైగా దూసుకుపోయింది. తీవ్రంగా గాయపడిన బాబా అక్కడికక్కడే చనిపోయాడు. 

Advertisement
Advertisement