రోడ్డు ప్రమాదంలో గాయపడిన వైనం వాయిదా పడిన వివాహం
మునగపాక: మరో రెండు రోజుల్లో ఆ ఇంట పెళ్లి బాజా మోగవలసింది. ఇప్పటికే బంధువులకు, స్నేహితులకు ఆహ్వానాలు పంపారు. సన్నాయి మేళాన్ని, కల్యాణమండపాన్ని సిద్ధం చేసుకున్నారు. ఇంతలో రోడ్డుప్రమాదం రూపంలో అవాంతరం ఎదురైంది. దంపతులు కానున్న ఇద్దరూ రోడ్డు ప్రమాదంలో గాయపడి విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండురోజుల్లో జరగాల్సిన వివాహం ఆగిపోయింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని మూలపేట గ్రామానికి చెందిన కాండ్రేగుల శ్రీనివాసరావు, ధనలక్ష్మి దంపతుల పెద్దకుమారుడు ప్రభాకరరావు అచ్యుతాపురంలోని బ్రాండెక్స్కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఎస్ రాయవరానికి చెందిన బొడ్డేడ శంకరరావు, పద్దేశమ్మ దంపతుల కూతురు సంతోషి కూడా అదే కంపెనీలో పని చేస్తోంది.
రెండు కుటుంబాలకు చెందిన పెద్దలు వీరిద్దరికీ వివాహం చేసేందుకు నిర్ణయించారు. ఈనెల 11న వరుడు ప్రభాకరరావు నివాసం ఉంటున్న మూలపేటలో వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. వారిద్దరూ కలిసి ఫొటోలను తీసుకునేందుకు సోమవారం ఉదయం అనకాపల్లికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో సంతోషిని స్వగ్రామం రాయవరంలో దించేందుకు స్కూటీపై పయనమయ్యారు. మరో పది నిమిషాల్లో ఇంటికి చేరిపోతున్నామనుకున్న సమయంలో సంతోషి తాను స్కూటీ నడుపుతానని ముందుకు వచ్చింది. ఏం జరిగిందో తెలియదు సమీపంలోని కాలువలోకి స్కూటీ దూసుకుపోయింది. ఈ సంఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు ప్రభాకరరావు, సంతోషిలను అనకాపల్లి వందపడకల ఆస్పత్రికి తరలించి, పరిస్థితి ప్రమాదకరంగా ఉండడంతో విశాఖలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఈనెల 11వ తేదీన జరగాల్సిన వివాహం వాయిదా పడింది. రెండు రోజుల్లో ఒక్కటి కావాల్సిన జంట రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చేరడంతో వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు.
రెండు రోజుల్లో పెళ్లి కాబోతుందనగా...
Published Wed, Feb 10 2016 12:06 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: మూడో దశలో... ముమ్మర పోరు
ఓటు వేసిన 5,964మంది
ఈవీఎంల కమిషనింగ్ పూర్తి
‘సాక్షి’ ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ ఖమ్మం అభ్యర్థి నామ నాగేశ్వరరావు
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెరగాలి
కోడ్ ముగియగానే ఇందిరమ్మ ఇళ్లు
ప్రజల గొంతుౖనై పోరాడా..
అంతకు మించి...
అటకెక్కిన కాంగ్రెస్ హామీలు
విద్యుత్ శాఖకు రూ.20 లక్షల నష్టం
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement