చిలకలూరిపేట: గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని ఆంధ్రాబ్యాంకు మెయిన్ బ్రాంచిలో మంగళవారం జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు రూ.30 లక్షల నగదు కాలిపోయింది. 10 కంప్యూటర్లు, ఫర్నిచర్, ఫైళ్లు బూడిదయ్యాయి. స్టోర్ రూంలో విద్యుత్ షార్ట సర్య్కూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.
బోస్రోడ్డులోని ఈ బ్యాంకులో ఉదయం 11 గంటల సమయంలో స్టోర్ రూం నుంచి మంటలు, పొగ వచ్చాయి. దీంతో సిబ్బంది ఖాతాదారులు బయటకు పరుగులు తీశారు. బ్యాంకు మేనేజర్ జి.శ్రీనివాసరావు సమాచారం ఇవ్వడంతో వచ్చిన అగ్నిమాపక సిబ్బంది భవనం గోడ పగలగొట్టి మంటలను అదుపులోకి తెచ్చారు. సాయంత్రం బ్యాంకు మేనేజర్ శ్రీనివాసరావు, అర్బన్ సీఐ స్టాంగ్ రూమ్లోకివెళ్లి పరిశీలించారు. లాకర్లు భద్రంగానే ఉన్నాయని ఖాతాదారులకు ఎటువంటి నష్టంలేదని ప్రకటించారు.
స్థానిక పండరీపురం బ్రాంచిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బ్యాంకు డీజీఎం గిరీష్కుమార్ మాట్లాడుతూ రైతుల పాసుపుస్తకాలు, తనఖా పెట్టిన బంగారానికి ఎటువంటి భయం లేదని తెలిపారు. లాకర్లను గురువారం ఉదయానికి పండరీపురం శాఖకు చేరుస్తామని, ఖాతాదారులు పరిశీలించుకోవచ్చని చెప్పారు. ప్రమాదంలో రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల నగదు కాలిపోయి ఉంటుందని ప్రాథమిక అంచనాలో తేలిందన్నారు.
రూ.30 లక్షల నోట్లు కాలిపోయాయి
Published Wed, Jul 1 2015 9:21 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement