337 కిలోల ఎర్రచందనం స్వాధీనం | Sakshi
Sakshi News home page

337 కిలోల ఎర్రచందనం స్వాధీనం

Published Fri, Apr 24 2015 6:22 PM

police arrests red sandalwood smugglers

చిన్నమండెం : వైఎస్సార్‌ జిల్లా చిన్నమండెం మండల పరిధిలోని దేవగుడిపల్లె పంచాయతీలో కొండమూలకు వెళ్లే దారిలో ఉన్న వాగులో ఏప్రిల్15న దాచి ఉంచిన 337 కిలోల బరువున్న 31 ఎర్రచందనం దుంగలను ఎస్‌ఐ సత్యనారాయణ శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు.

వీటి విలువ సుమారు రూ.5లక్షలు ఉంటుందని తెలిపారు. ఈ దుంగలను తరలించేందుకు ప్రయత్నిస్తున్న ఐదుగురు స్మగర్లు.. టి.నాగరాజు, డి.సాయిప్రతాప్, ఎస్. రమణయ్యలు, సి.నాగరాజు, జి.కృపాకర్‌లను కూడా అదుపులోకి తీసుకున్నామన్నారు.

Advertisement
Advertisement