వైఎస్ జగన్ అంటేనే ప్రజలకు భరోసా: వైఎస్ భారతి | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్ అంటేనే ప్రజలకు భరోసా: వైఎస్ భారతి

Published Fri, Apr 18 2014 7:01 PM

వైఎస్ జగన్ అంటేనే ప్రజలకు భరోసా: వైఎస్ భారతి - Sakshi

కడప:  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి అంటేనే ప్రజలకు భరోసా అని వైఎస్‌ భారతి అన్నారు.  వైఎస్‌ జగన్‌ తరఫున పులివెందులలో చేపట్టిన ప్రచారంలో వైఎస్‌ భారతి మాట్లాడుతూ... చంద్రబాబును ప్రజలు నమ్మరు అని అన్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి వైఎస్‌ జగన్‌ ను భగవంతుడు ఆశీర్వదిస్తాడని వైఎస్‌ భారతి అన్నారు. 
 
రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు అసలు నమ్మరని వైఎస్‌ భారతి తెలిపారు. పులివెందులలో నిర్వహించిన ప్రచారానికి ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. వైఎస్ భారతి నిర్వహించిన ప్రచారంలో  వైఎస్‌ ప్రమీలమ్మ, వైఎస్‌ మనోహర్‌ రెడ్డి  పాల్గొన్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement