‘ఎన్టీఆర్ గృహనవీకరణ’కు రూ.17 కోట్లు
మూడు నెలలవుతున్నా పథకంలో కానరాని పురోగతి
జన్మభూమి కమిటీల తాత్సారంతో పేదల్లో నిరాశ
ఎన్నడో సర్కారు నిర్మించి ఇచ్చిన తమ చిన్నిగూళ్లలో.. కాలక్రమంలో తలెత్తిన చిన్నాపెద్దా లోపాలను సరిదిద్దుకోవడానికి తిరిగి సర్కారే చేయూతనిస్తోందని సంతోషించారు పేదలు. 1993-2004 మధ్య ప్రభుత్వం నిర్మించిన ఇళ్ల మరమ్మతులకు జిల్లాకు రూ.17 కోట్లు మంజూరు కాగా..నియోజకవర్గానికి 1,000 ఇళ్లను ఎంపిక చేయూల్సి ఉంది. అయితే జన్మభూమి కమిటీల జాప్యం పేదలను నిరాశకు గురి చేస్తోంది.
మండపేట : పేదల ఇళ్లకు మరమ్మతులు చేసేందుకు నిర్దేశించిన ‘ఎన్టీఆర్ గృహనవీకరణ’ పథకం జిల్లాలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడ అన్న చందాన ఉంది. ఈ పథకం కింద మరమ్మతులకు రూ.17 కోట్లు మంజూరై దాదాపు మూడు నెలలు కావస్తున్నా క్షేత్రస్థాయిలో కార్యరూపం దాల్చడం లేదు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఇంకా ప్రారంభంకాలేదు. జన్మభూమి కమిటీలు పట్టనట్టు వ్యవహరిస్తుండటం ఇందుకు కారణంగా తెలుస్తోంది. 1993 -2004 మధ్య కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం నిర్మించిన పేదల ఇళ్లకు ఎన్టీఆర్ గృహ నవీకరణ పథకం కింద మరమ్మతులు చేరుుంచేందుకు మూడు నెలల క్రితం ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
జిల్లాలోని అర్బన్ నియోజకవర్గాలు మినహా మిగిలిన 17 నియోజకవర్గాలకు ఒక్కో నియోజకవర్గానికి వెయ్యి ఇళ్లకు నిధులను కేటాయించింది. ఒక్కో ఇంటి మరమ్మతుల నిమిత్తం రూ.10 వేల చొప్పున రూ.17 కోట్లను మంజూరు చేసింది. ఆ రూ.10 వేలతో దెబ్బ తిన్న ఇంటి పైకప్పు మరమ్మతులు, ప్లాస్టింగ్, ఫ్లోరింగ్, గోడలు, శానిటరీ లీకేజీలు, విద్యుత్ వ్యవస్థ తదితరాలకు మరమ్మతులు చేరుుంచుకుని, పాడైన ఇళ్లను నివాసయోగ్యంగా మార్చుకోవచ్చు. లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను సర్కారు జన్మభూమి కమిటీలకు అప్పగించింది. జనవరి ఒకటి నుంచి ప్రారంభించి మూడు నెలల వ్యవధిలో పూర్తి చేయాలని సూచించింది. కాగా జిల్లాలో ఎక్కడ ఈ పథకం అమలుకాకపోవడం విమర్శలకు తావిస్తోంది.
జిల్లాలో 17 వేల ఇళ్లకు అవకాశం
1993 - 2004 మధ్య కాలంలో జిల్లావ్యాప్తంగా 2,01,780 ఇళ్లను నిర్మించగా ఎన్టీఆర్ గృహనవీకరణ పథకం కింద 17 వేల ఇళ్లను మాత్రమే నవీకరించుకునే వీలుంది. ఇంటి పట్టా, ఆధార్, రేషన్కార్డు, బ్యాంకు పాస్బుక్, సెల్నంబర్ తదితర వివరాలతో కూడిన దరఖాస్తులను జన్మభూమి కమిటీలు ఆమోదించి గృహనిర్మాణ శాఖ పరిశీలన నిమిత్తం పంపాలి. ఆ దిశగా జన్మభూమి కమిటీలు చొరవ చూపకపోవడంతో ఈ పథకం ఎక్కడా ముందుకు సాగడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఎంపిక చేసిన ఇళ్లను గృహ నిర్మాణసంస్థ సిబ్బంది జియో ట్యాగింగ్ పరిధిలోకి తీసుకురావాలి. వీడియో కాన్ఫరెన్స్లలో తరచూ అధికారులు పథకం అమలు తీరుపై సమీక్షించడం మినహా క్షేత్రస్థాయిలో కార్యరూపం దాల్చకపోవడం గమనార్హం. ఈనెల 15 నాటికి లబ్ధిదారుల వివరాలు అందజేయాలని ఇప్పటికే ఉన్నతస్థాయి నుంచి జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు అందినట్టు సమాచారం. కాగా ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల మేరకు లబ్ధిదారుల వివరాలను జన్మభూమి కమిటీలు ఇవ్వకపోతే ఏం చేయగలమని అధికారులు ప్రశ్నిస్తున్నారు. నిధులు మంజూరై, మరమ్మతులు చేరుుంచుకుంటే మరికొంత కాలం తమ ఇళ్లు పదిలంగా ఉంటాయని గంపెడాశతో ఉన్న పేదలు పథకాన్ని త్వరగా అమలు చేయాలని కోరుతున్నారు.
లబ్ధిదారుల వివరాలు రావాలి..
ఈ పథకం లబ్ధిదారుల వివరాలను ఈనెల 15 నాటికి పంపాల్సి ఉందని గృహ నిర్మాణ సంస్థ పీడీ సెల్వరాజ్ చెప్పారు. ఆ దిశగా జన్మభూమి కమిటీలు వివరాలు సేకరించాలని మండల పరిషత్ అధికారులకు సూచించామన్నారు. త్వరితగతిన లబ్ధిదారుల వివరాలు సేకరించి మంజూరు నిమిత్తం ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు.
చిన్ని మా గూళ్లు.. బాగయ్యేదెన్నడో?
Published Thu, Feb 11 2016 12:40 AM
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ముగిసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ
శ్రీరామానంద స్వామిజీ పాదయాత్ర
కుంభకోణాలకు చట్టబద్ధత కల్పించింది బీజేపీయే
No Headline
‘దేవర’ చిత్ర యూనిట్ను వదలని తేనెటీగలు
హోరెత్తిన ఎన్నికల ప్రచారం
సంక్షేమ ప్రభుత్వానికి ప్రజల మద్దతు
మన్యంలో మోసగాడు
పశువుల కోసం వెళ్లి గోదావరిలో పడి విద్యార్థి మృతి
హైరిస్క్ గర్భిణుల గుర్తింపు
తప్పక చదవండి
- ఐపీఎల్ మధ్యలోనే దుబాయ్ వెళ్లిన సన్రైజర్స్ కెప్టెన్..
- ఫోటో తీస్తే కవిత రాసే కెమెరా.. ఇది కదా టెక్నాలజీ అంటే!
- అయ్యయ్యో సేతిలో డబ్బులు పోయెనే.. జేబులు ఖాళీ ఆయనే
- పాపం బ్రెజిల్.. ఎటు చూసినా వరదలే..
- కష్టాల్లో 'పద్మ శ్రీ మొగిలయ్య'.. సాయం చేసిన బుల్లితెర నటి
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
- ‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
- టీడీపీ అడ్డంగా బుక్కైంది: సజ్జల కీలక వ్యాఖ్యలు
- వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement