- కడుపు నొప్పి, విరేచనాలతో బాధపడుతున్న కస్తూరిబా బాలికలు
- నాలుగేళ్ల నుంచి నిషేధిత నీరు తాగుతున్న బాలికలు
- 24 గంటల్లో సాగర్నీరు అందిస్తాం : డిప్యూటీ కలెక్టర్
కనిగిరి : స్థానిక కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల (కేజీబీవీ) విద్యార్థినులు తొమ్మిది మంది అస్వస్థతకు గురయ్యారు. గురువారం రాత్రి నుంచే తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుండటంతో శుక్రవారం స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించారు. వివరాలు.. కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థినులు కడుపు నొప్పి, విరేచనాలు, దగ్గు, జలుబుతో బాధపడుతున్నారు. వీరిని ఏఎన్ఎం వసుంధర గురువారం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తీసుకొచ్చి మందులు ఇప్పించింది. తాత్కాలికంగా ఉపశమనం కలగడంతో తిరిగి కేజీబీవీకి తీసుకెళ్లారు. మరుసటి రోజు 8,7 తరగతులకు చెందిన 9 మందికి తీవ్ర కడుపునొప్పి వచ్చింది. హుటాహుటిన ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో ఏడో తరగతికి చెందిన త్రివేణి, రాజ్యలక్ష్మి, ఎనిమిదో తరగతికి చెందిన బి.అనుషా, అఖిల, ఉమాదేవి, ఎన్.నాగలక్ష్మి, సుష్మ, రాజ్యలక్ష్మి, ఎన్.మౌనిక ఉన్నారు.
హాస్టల్లో వైద్య శిబిరం
స్థానిక కేజీబీవీ హాస్టల్లో డాక్టర్ నాగరాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఎక్కువ మంది విద్యార్థులు దగ్గు, జలుబుతో బాధపడుతున్నట్లు గుర్తించారు. వారికి మందులు పంపిణీ చేశారు. బోర్వాటర్ కావడంతో చాలా మందికి స్కిన్ ఎలర్జీ ఉన్నట్లు ఆమె తెలిపారు.
అధికారుల పరామర్శలు
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికలను డిప్యూటీ కలెక్టర్, ఎస్ఎస్ఎ పీఓ ఎంవీ సుధాకర్ పరామర్శించారు. మంచినీరు వల్లే విద్యార్థినులు అనారోగ్యం బారిన పడ్డారని అధికారులు నిర్ధారణకు వచ్చారు. వెంటనే ఆర్డ బ్ల్యూఎస్ ఈఈ, డీఈలతో మాట్లాడారు. 24 గంటల్లో కస్తూరిబాకు సాగర్ వాటర్ సరఫరా చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. నీటి సమస్యపై సర్పంచ్ సైకం మాలకొండారెడ్డి, ఎంపీపీ నంబుల వెంకటేశ్వర్లుతో అధికారులు చర్చించారు. తక్షణ చర్యగా ట్యాంకర్ ద్వారా సాగర్ నీటిని సరఫరా చేయించాలని ఎస్ఓ సుజాతాను ఆదేశించారు. విద్యార్థినులను పరామర్శించిన వారిలో డిప్యూటీ డీఎంహెచ్ఓ పి.విజయలక్ష్మి, ఎంఈఓ జి.సుబ్బరత్నం, జీసీడీఓ పి.సరస్వతి, ఐఈ కో ఆర్డినేటర్ డి.వెంకారెడ్డి, సీఎంఓ డి.గంగాధర్, ఏఎల్ఎస్ కో ఆర్డినేటర్ ఏసోబు ఉన్నారు.
అధికారులతో తల్లిదండ్రుల వాగ్వాదం
బాలికలు అనారోగ్యానికి గురయ్యారని తెలిసి తల్లిదండ్రులు కేజీబీవీకి, ఆస్పత్రికి చేరుకున్నారు. తమ పిల్లలకు ఆరోగ్యం బాగులేకుంటే సమాచారం ఇవ్వరా.. అని అధికారులను ప్రశ్నించారు. తాము టీవీల్లో చూసి హడావుడిగా రావాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
తొమ్మిది మంది విద్యార్థినులకు అస్వస్థత
Published Sat, Jul 4 2015 4:26 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
Voting Procedure: ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)
కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్
మొలకలతో బోలెడన్ని ప్రయోజనాలు, ఈ సైడ్ ఎఫెక్ట్స్తెలుసుకోండి!
కమిన్స్ మాటలు విని షాకైన హార్దిక్! వీడియో వైరల్
జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
కుటుంబాన్ని బండ బూతులు తిట్టిన చంద్రబాబుతో పవన్ పొత్తు..!
చంద్రబాబుపై రైతుల ఆగ్రహం
తప్పక చదవండి
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement