- కార్మిక హక్కులు కాలరాస్తున్న మోదీ సర్కార్పై పోరాటానికి సిద్ధమవండి
- అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు పెద్దన్న
చీరాలటౌన్ : మోదీ పాలన పేదల భక్షణ..బడా బాబులకు రక్షణగా నిలుస్తోందని, పేద ప్రజల సంక్షేమమే ధ్యేయం..నల్లదనాన్ని వెలికితీసి పేదలకు అందిస్తానని చెప్పి గద్దెనెక్కిన ప్రధాని నరేంద్ర మోదీ కార్మిక హక్కులను కాలరాస్తున్నారని అఖిలభారత కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు సి.పెద్దన్న విమర్శించారు. చీరాలలోని షిర్డీ సాయిబాబా కల్యాణ మండపంలో ప్రజాతంత్ర చేనేత కార్మిక సంఘం, అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా కార్మిక సదస్సు ఆదివారం నిర్వహించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక కార్పొరేట్ సంస్థలో ఊడిగం చేసే విధంగా కార్మిక హక్కులపై దాడి చేయడం ప్రారంభించిందన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు, కార్మికుల సమస్యలను వదిలేసి విదేశీ పర్యటనలకు, విదేశీ పెట్టుబడులు ఆకర్షించడం కోసం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రవేటీకరించే చర్యలకు పూనుకుంటున్నాయని చెప్పారు. దేశ సంపదలను కొల్లగొడుతూ విదేశీయులకు రెడ్ కార్పెట్లను పర్చడంలో మోదీని మించిన వారు లేరన్నారు. సెప్టెంబర్ 2న చేపట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాసేలా జీవోలను ఇవ్వడం దారుణమన్నారు.
కార్మికులకు ఉన్న పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలను కూడా నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని వీటన్నింటిని తిప్పికొట్టేందుకు అందరూ సిద్ధం కావాలన్నారు. కార్మికులకు కనీసవేతనం రూ.15 వేలు ఇవ్వాలని, కార్మికులకు సామాజిక భద్రత కల్పించి కార్మిక చట్టాల సవరణలు ఆపివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు వార్తికోట సుబ్బారావు, డివిఎన్ స్వామి, ఎస్. లలితకుమారి, కత్తి పేరయ్య, ఎన్. కుటుంబరావు, ఎ.సతీష్, అధికసంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.
మోదీ పాలనలో పేదల భక్షణ
Published Mon, Aug 31 2015 3:01 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement