- మృతదేహాన్ని కాలువలో పడేసిన హంతకులు
- పోలీసుల అదుపులో అనుమానితులు
కందుకూరు: వివాహిత దారుణ హత్యకు గురైంది. ఈ సంఘటన పట్టణంలో శనివారం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. పొన్నలూరు మండలం వెల్లటూరుకు చెందిన ఇత్తడి మరియమ్మ(27)కు జరుగుమల్లి మండలం నందనవనం గ్రామానికి చెందిన రవితో పదకొండు ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి పదేళ్ల కుమారుడు ఉన్నాడు. భర్తతో విభేదాల కారణంగా ఆమె ఒంటరిగా నివాసం ఉంటోంది. పట్టణంలోని జనార్దన కాలనీలో ఓ గదిని అద్దెకు తీసుకుంది. వివాహాలు, ఫంక్షన్లకు భోజనాలు తయారుచేసే పనులకు వెళ్తూ జీవనం సాగిస్తోంది.
ఈ నేపథ్యంలో ఇంటికి సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో మరియమ్మ మృతదేహమై కనిపించింది. మృతదేహం పడి ఉన్న తీరు, ఒంటిపై దుస్తులు చెరిగిపోవడంతో హంతకులు ఆమెపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేసి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. స్థానికులు కూడా హత్యేగానే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని సీఐ నరసింహారావు పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీస్ జాగిలాన్ని రప్పించారు. జాగిలం సంఘటన స్థలంలో కొద్దిసేపు తిరిగిన అనంతరం అక్కడి నుంచి నేరుగా సమ్మర్ స్టోరేజీ ట్యాంకు వరకు వెళ్లింది.
పోలీసుల అదుపులో అనుమానితులు
మహిళ హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురు అనుమానితులను పోలీ సులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రధానంగా పట్టణంలో మెకానిక్గా పనిచేసే బాజీ అనే యువకుడితో మరియమ్మకు వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి హత్య జరిగి ఉంటుందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పలువురు వంట మేస్త్రిలను కూడా పోలీసులు విచారిస్తున్నారు. పోలీసుల విచారణ అనంతరం మరియమ్మ హత్యకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడయ్యే అకాశం ఉంది.
వివాహిత దారుణ హత్య
Published Sun, Aug 13 2017 7:28 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోమ్ ఓటింగ్ ప్రక్రియ వేగవంతం చేయండి
మోదీని ఆపే దమ్ము కేసీఆర్కే ఉంది
కాలవ అండ .. కరిగిన కొండ!
వైఎస్ జగన్తోనే సంక్షేమం
ప్రమాదంలో ఒకరి మృతి
ఐస్క్రీం తిని 100 మందికి అస్వస్థత
పాండవపురలోనూ అబార్షన్ దందా
స్టీరింగ్ విరిగి.. వరి మడిలోకి
కస్టడీలో రేవణ్ణ విచారణ
వీడియో బాధితుల కోసం సిట్ సహాయవాణి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement