కవలగొయ్యి (రాజమండ్రి రూరల్) :విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కోసం స్తంభం ఎక్కిన లైన్మన్ విద్యుత్ షాక్కు గురై మరణించిన సంఘటన శనివారం ఉదయం కవలగొయ్యి గ్రామంలో చోటు చేసుకుంది. ప్రత్యక్షసాక్షులు, పోలీసుల కథనం ప్రకారం... రాజమండ్రి లాలాచెరువు గాంధీపురం-4 ప్రాంతానికి చెందిన కాదా శ్రీనివాసరావు(45) శాటిలైట్ సిటి విద్యుత్సబ్స్టేషన్(డి-7సెక్షన్)పరిధిలో కవలగొయ్యి, పిడింగొయ్యి గ్రామాల లైన్మన్గా పనిచేస్తున్నారు. విద్యుత్ సరఫరా లేదని కవలగొయ్యి గ్రామానికి చెందిన రైతు మరుకుర్తి వెంకట్రావు లైన్మెన్ శ్రీనివాసరావుకు ఫోన్ చేశారు.
దీంతో ఆయన సబ్స్టేషన్కు సమాచారం అందించి ప్రైవేటు ఎలక్ట్రీషియన్ రామారావును తీసుకుని కవలగొయ్యి వచ్చారు. గ్రామంలోని లా కళాశాల ఎదురుగా ఉన్న 9.1పోల్పై జంపర్కట్ అయింది. దీంతో వెంటనే లాలాచెరువు 33/11 కేవీ సబ్స్టేషన్కు ఫోన్ చేసి ఎల్సీ(విద్యుత్ సరఫరా నిలపమని)తీసుకున్నాడు. విద్యుత్ సరఫరా నిలిపివేసిన తరువాతే శ్రీనివాస్ స్తంభం ఎక్కి బాగుచేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్షాక్ తగిలి మంటలు వ్యాపించి, అతను కిందపడిపోయాడు. వెంటనే అతడిని ఆటోలో రాజమండ్రిలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా వైద్యులు అతడిని మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ శ్రీనివాస్ మృతిచెందాడు. ఈమేరకు బొమ్మూరు ఎస్సై జాన్మియా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
విషాదంలో కుటుంబ సభ్యులు
విషయం తెలియగానే రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి కాదాశ్రీనివాసరావు భార్య కృష్ణవేణి, అతడి కుమార్తె, కుటుంబసభ్యులు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. అలాగే ఏపీఈపీడీసీఎల్(ఆపరేషన్) డీఈఈ శ్యాంబాబు, ఏడీఈ నక్కపల్లి శామ్యూల్, ఏఈలు షిలార్, ప్రసాద్, శ్రీనివాస్, ఉద్యోగులు అధికసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. తోటి కార్మికుడు విధి నిర్వహణలో మృత్యువాతపడడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మూడు నెలల క్రితమే అపార్టుమెంట్లో ఫ్లాట్ తీసుకుని గృహప్రవేశం చేసిన శ్రీనివాసరావు ఇలా మృత్యువు కబలిస్తుందని అనుకోలేదని ఆవేదన చెందారు.
విద్యుత్ షాక్తో లైన్మన్ మృతి
Published Sun, Aug 24 2014 12:40 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)
గాలివానలో చిక్కుకున్న హెలికాఫ్టర్.. నవీన్ పట్నాయక్కు తప్పిన ప్రమాదం
సోనాక్షీతో ఇంటిమేట్ సీన్స్.. ఆమె ఆమ్మగారు ఏమన్నారంటే: నటుడు
నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!
2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!
వరల్డ్కప్ ట్రోఫీతో ఫోజులిచ్చిన యువరాజ్.. ఫోటోలు వైరల్
ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..
గతంలో ఎప్పుడైనా ఇంత మంచి జరిగిందా?: సీఎం జగన్
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement