అనూహ్య హత్యకేసు విచారణ 13కు వాయిదా | Sakshi
Sakshi News home page

అనూహ్య హత్యకేసు విచారణ 13కు వాయిదా

Published Thu, Jul 31 2014 3:17 PM

అనూహ్య హత్యకేసు విచారణ 13కు వాయిదా

విజయవాడ: ముంబైలో హత్యకు గురైన తెలుగు యువతి సింగవరపు ఎస్తేర్ అనూహ్య హత్యకేసు విచారణను ముంబై కోర్టు ఆగస్టు 13కు వాయిదా వేసింది. 13న తమ ఎదుట హాజరుకావాలని అనూహ్య తండ్రిని కోర్టు ఆదేశించింది. జనవరి 5న కుర్లాలో అదృశ్యమైన అనూహ్య, కంజూర్‌మార్గ్-భాండూప్‌లో శవమై తేలిన సంగతి తెలిసిందే.

ఈ కేసులో నిందితుడైన చంద్రబాన్ సానప్ అలియాస్ చౌక్యా  ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. దేశవ్యాప్తంగా చర్చనీయంగా మారిన అనూహ్య కేసును సవాల్‌గా తీసుకున్న ముంబై పోలీసులు లభించిన ఆధారాలకు అనుగుణంగా 542 పేజీల చార్జిషీట్‌ను ఇప్పటికే దాఖలు చేశారు.

Advertisement
Advertisement