* రూ.20 వేలు తీసుకున్నారంటూ తాలూకా
* పోలీసులను ఆశ్రయించిన బాధితుడు
ఒంగోలు : ‘మీరు అక్రమ వ్యాపారం చేస్తున్నారు.. మీ గుట్టు రట్టుచేస్తాం.. మిమ్మల్ని బజారుకీడుస్తాం.. మర్యాదగా రూ.40 వేలు ఇవ్వండి.. లేకుంటే జైలుకెళ్లక తప్పదు’... అని మీడియా పేరుతో ముగ్గురు యువకులు హల్చల్ చేశారు. వారిదెబ్బకు బెంబేలెత్తి రూ.20 వేలు ముట్టజెప్పి బయటపడిన బాధితుడు శనివారం ఒంగోలు తాలూకా పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే, ఈ సంఘటన తమ పరిధిలోది కాదని తాలూకా పోలీసులు స్పష్టం చేశారు.
అసలు ఏం జరిగిందంటే...
మూడు రోజుల క్రితం చీమకుర్తి మండలం గోగినేనివారిపాలెంలో ఈ సంఘటన జరిగింది. ఈ విషయం ఆ గ్రామం మొత్తానికి తెలిసినా పోలీసుల దృష్టికి మాత్రం రాలేదు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన డ్రైవర్ జె.శ్రీనుయాదవ్, క్లీనర్ షేక్ ఫజుల్లాలు ఒంగోలులోని ఓ డీజిల్ ట్యాంకర్కు రెండేళ్లుగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో మూడురోజుల క్రితం స్థానిక సూరారెడ్డిపాలెం ఐవోసీ కార్యాలయం నుంచి ట్యాంకర్ ఆళ్లగడ్డకు బయలుదేరింది. సూరారెడ్డిపాలెం, ఒంగోలు, చీమకుర్తి, పొదిలి, బేస్తవారిపేట, గిద్దలూరు మీదుగా ఆళ్లగడ్డ వెళ్లాల్సి ఉండగా, మెయిన్రోడ్డును వదిలి చీమకుర్తి మండలం గోగినేనివారిపాలెం చేరుకుంది.
దందా ఇలా...
ట్యాంకర్ దారితప్పిందని ముగ్గురు వ్యక్తులు గమనించారు. రెండు మోటారు బైకులపై నేరుగా గోగినేనివారిపాలెం చేరుకున్నారు. అక్కడ వీడియో కెమేరాలో షూట్చేస్తూ దందా ప్రారంభించారు. అక్రమ వ్యాపారం చేస్తున్నారని, జాతీయ చానళ్లలో చూపించాల్సి వస్తుందని డ్రైవర్, క్లీనర్లను బెదిరించారు. తాము భోజనం చేసేందుకు గ్రామంలో తమకు తెలిసిన చిన్నా ఇంటికి వచ్చామని డ్రైవర్ వారించినా వినిపించుకోలేదు. దీంతో చిన్నా అనే వ్యక్తి కల్పించుకుని దందా చేస్తున్న వారితో చర్చించారు. వారు రూ.40 వేలు డిమాండ్ చేయగా, రూ.20 వేలు ఇప్పించాడు. ప్రస్తుతం మరో రూ.5 వేలు కూడా ఇవ్వాలని డ్రైవర్కు ఫోన్లు చేసి బెదిరిస్తుండటంతో ట్యాంకర్ యజమాని దృష్టికి డ్రైవర్ తీసుకెళ్లాడు. సంబంధిత యజమాని ఆదేశాల మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అనేక అనుమానాలు...
ఈ సంఘటనపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. చిన్నా ఎవరు.? అతనికి, ట్యాంకర్ డ్రైవర్కు సంబంధం ఏంటి.? మీడియా పేరుతో ట్యాంకర్ను వెంబడించిన వారు ఎవరు.? నిజంగా మీడియాలో పనిచేసేవారేనే..కాదా..? వారు బెదిరిస్తే డబ్బు ఎందుకు ఇచ్చారు.? లాంటి ప్రశ్నల్లో ఏ ఒక్కదానికీ సమాధానం లేదు. దీనిపై పూర్తిస్థాయిలో విచారించాల్సిన పోలీసులు.. తమ పరిధిలోది కాదని చేతులెత్తేయడం పలు విమర్శలకు తావిస్తోంది.
మీడియా పేరుతో దందా
Published Sun, Jan 25 2015 5:28 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement