ఏపీ సర్కారుకు ఏడాదికి రూ.1200 కోట్ల రాబడి
జపాన్ వెళుతూ సీఎం సంతకం.. జీవోల జారీ
సాక్షి, హైదరాబాద్: సీఎం చంద్రబాబుఒకే ఒక్క సంతకంతో ఏడాదికి అదనంగా రూ.1,200 కోట్లు ఖజానాకు ఆదాయం వచ్చే నిర్ణయం తీసుకున్నారు. భూములు, స్థలాల క్రయవిక్రయాలకు సంబంధించిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, కుటుంబాల మధ్య సెటిల్మెంట్, గిఫ్ట్ (భూ కానుక) డీడ్ల ఫీజులను పెంచే ఫైలుపై సీఎం జపాన్ పర్యటనకు వెళ్లే ముందు సంతకం చేశారు. ఆ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.పి.సింగ్ బుధవారం మూడు జీవోలను జారీ చేశారు. ఈ పెంపు వెంటనే (బుధవారం నుంచే) అమల్లోకి వస్తున్నట్లు స్పష్టం చేశారు.
దీంతో భూములు, స్థలాలు క్రయ విక్రయదారులపై ఏడాదికి సుమారు రూ.1200 కోట్ల మేర అదనపు భారం పడుతుందని అంచనా. జీవోల ప్రకారం.. స్టాంపు డ్యూటీ ప్రస్తుతం ఉన్న 4 శాతం నుంచి 5 శాతానికి పెరిగింది. రిజిస్ట్రేషన్ ఫీజు 0.5 శాతం నుంచి 1 శాతానికి పెరిగింది. కుటుంబాల మధ్య జరిగే సెటిల్మెంట్ డీడ్లు, గిఫ్ట్ డీడ్లపై ప్రస్తుతం ఉన్న ఒక శాతం స్టాంపు డ్యూటీని రెండు శాతానికి పెంచుతూ జీవో జారీ అయ్యింది. విభజిత ఆంధ్రప్రదేశ్లో స్టాంపులు, రిజస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం ఇప్పటికే బాగా పెరిగింది. నూతన రాజధాని నిర్మాణం జరిగే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భూముల క్రయ విక్రయాలు బాగా పెరగడంతో ఆదాయం కూడా భారీగా పెరిగింది. ఆదాయం పెంపుపై దృష్టిసారించిన ప్రభుత్వం.. వస్తున్న చోటే మరింత ఆదాయం పొందాలన్నట్టుగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఫీజులను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గతంలో సెటిల్మెంట్, గిఫ్ట్ డీడ్లపై స్టాంపు డ్యూటీని కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వం తగ్గించింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం వాటిపై కూడా స్టాంపు డ్యూటీని పెంచింది.
పెంపు వివరాలు.. (శాతాల్లో) రంగం
ఇప్పటివరకు ఇకపై స్టాంపు డ్యూటీ 4 5
రిజిస్ట్రేషన్ ఫీజు 0.5 1
కుటుంబసభ్యుల మధ్య ఒప్పందం 1 2
ఇతరుల మధ్య ఒప్పందం 2 3
రక్త సబంధీకులకు కానుకలు 1 2
ఇతరుల మధ్య కానుకలు 4 5
భాగస్వామ్య ఒప్పందాలు(కుటుంబసభ్యులు) 0.5 1
ఇతరుల మధ్య భాగస్వామ్య ఒప్పందాలు 1 2
బాదుడే బాదుడు
Published Thu, Nov 27 2014 3:14 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- 25 కిలోల బంగారం స్మగ్లింగ్.. భారత్లోని అఫ్గనిస్తాన్ దౌత్యవేత్త రాజీనామా
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
Advertisement