హైదరాబాద్: వైఎస్ రాజశేఖర రెడ్డి వంటి పాలన అందించ దమ్ముందా అని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని వైఎస్ఆర్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేత వైఎస్ జగన్మోహన రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీ కమిటీ హాలులో ఈ మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికార పార్టీ శాసనసభలో దివంగత నేత రాజశేఖర రెడ్డిని తిట్టడమే పనిగా పెట్టుకుందన్నారు. రాజశేఖర రెడ్డి పాలనలో మాదిరిగా కులమతాలకు అతీతంగా, పారదర్శికంగా, ప్రజా సంక్షేమా కార్యక్రమాలను చేపట్టే దమ్ము ఉందా అని చంద్రబాబును ప్రశ్నించారు. ఆయన మాదిరిగా ప్రజలపై భారం మోపకుండా, చార్జీలు పెంచకుండా ఉండగలరా అని అడిగారు. ఈరోజు రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. పాత బకాయిలు చెల్లిస్తే తప్ప బ్యాంకుల దగ్గరకు వెళ్లలేని దుస్థితి ఉందన్నారు. రైతులు బయట రెండు రూపాయిల వడ్డీతో రుణాల కోసం తిరుగుతున్నారని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ లేదా బీమా అందించి ఆదుకుందా? అని ప్రశ్నించారు.
ప్రజల దగ్గరకు వెళ్లి ఆయా గ్రామాల్లో వారి అవసరాలు తెలుసుకోవాలన్నారు. ప్రజలు వద్దని చెప్పినా ప్రభుత్వం ఎందుకు నిర్ణయాలు తీసుకుంటుందని అడిగారు. ప్రజాభిప్రాయ సేకరణకు భిన్నంగా వ్యవహరించడం తగదన్నారు. గిరిజనులు వద్దంటున్నా బాక్సైట్ తవ్వకాలు ఎందుకు చేస్తున్నారు? అని ప్రశ్నించారు. దీని వల్ల ఆ ప్రాంతంలో అసంతృప్తి జ్వాలలు చెలరేగే అవకాశముందని హెచ్చరించారు.
చంద్రబాబు మూడు నెలల పాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను దారుణంగా చంపేస్తున్నారని విమర్శించారు. ఓ వైపు శాసనసభలో శాంతిభద్రతలపై చర్చ జరుగుతుండగానే అనంతపురం జిల్లాలో హత్యలు జరిగాయని తెలిపారు. అధికారమన్నది శాశ్వతం కాదని హెచ్చరించారు. ఇవాళ అధికారంలో ఉన్నవారు రేపు ప్రతిపక్షంలో ఉంటారని చెప్పారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడి ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించడం ముఖ్యం అని హితవు పలికారు.
రాజశేఖరరెడ్డి వంటి పాలన అందించే దమ్ముందా?:వైఎస్ జగన్
Published Wed, Aug 27 2014 4:40 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement