- ఆలస్యంగా ఇంటికి వచ్చిన విద్యార్థిని మందలించిన తల్లిదండ్రులు
- మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు
- 24 గంటలు అనాథగా మిగిలిపోయిన మధు శవం
కాశీబుగ్గ: తల్లిదండ్రులు మందలించారని మనస్తాపానికి గురై ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటికి ఆలస్యంగా రావడం ఏమిటని అడిగినందుకు చిన్నబోయి క్షణికావేశంలో ప్రాణాలు తీసుకున్నాడు. ఆ తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చాడు. ఈ హృదయవిధారక సంఘటన పలాసలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి మృతుని కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి.
పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో 2వ వార్డు పద్మనాభపురం కాలనీలో చెంచాన రాజేంద్ర, జ్యోతి నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉంది. కుమారుల్లో పెద్దవాడు చెంచాన మధు(21). ఇతడు కాశీబుగ్గలోని శ్రీమేధ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. పట్టణంలో వెంకటేశ్వర థియేటర్ వెనుక భాగంలో దాబా నడుపుతూ పిల్లలను చదివిస్తున్నారు.
మధు చదువులో అంతంతమాత్రంగా రాణించడంతో తల్లిదండ్రులు బాగా చదువుకోమని నచ్చజెప్పేవారు. అయితే ఇంటికి ఆలస్యంగా వచ్చినందుకు తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన మధు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఫ్రెండ్షిప్ డే సందర్భంగా చక్కని దుస్తులు ధరించి స్నేహితులతో కలిసి పలాసకు 7 కిలోమీటర్లు దూరంలో ఉన్న శివసాగర్ బీచ్కు వెళ్లాడు. మధ్యాహ్నం భోజనానికి సైతం ఇంటికి రాకుండా రాత్రి 8 గంటలకు చేరుకున్నాడు. ఉదయం వెళ్లి ఇప్పటివరకు రాకపోవడంపై తల్లిదండ్రులు మందలించారు. బుద్ధిగా చదువుకోకుండా బీచ్లలో తిరుగుళ్లేమిటని ఆగ్రహించారు.
ఈ విషయం మధుకు రుచించక ఇంట్లో వారితో మాట్లాడకుండానే ఆ రాత్రి నిద్రించాడు. మనస్తాపానికి గురైన ఇతడు సోమవారం ఉదయం ఇంటికి సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్పై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పలాస నుంచి సున్నాదేవి వైపు ఉన్న రైలు మార్గంలో గుర్తుతెలియని రైలు కింద తలపెట్టి మృతి చెందాడు. ఈ విషయం తెలిసిన వెంటనే జీఆర్పీ సిబ్బంది హెచ్సీ పి.కోదండరావు ఆధ్వర్యంలో మృతదేహాన్ని స్టేషన్కు తరలించారు.
మొహం పోల్చుకునే రీతిలో లేకపోవడంతో మృతుని తల్లిదండ్రులు పనిచేస్తున్న దాబా పక్కనుంచే పలాస ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి 24 గంటలు అనాథ శవంగా వదిలేశారు. రోజంతా మధు కనబడక తల్లడిల్లిన తల్లి జ్యోతి స్నేహితులతో ఆరా తీయించింది. కుటుంబ సభ్యులు, బంధువులతో వెతికించారు. ఈ తరుణంలో కొంతమంది స్థానికులు గుర్తుతెలియని వ్యక్తి మృతి అనే విషయం పత్రికల్లో రావడాన్ని తెలియజేశారు. దీంతో మంగళవారం ఉదయం మధు కుటుంబ సభ్యులంతా పలాస ప్రభుత్వాస్పత్రికి వెళ్లి మృతదేహాన్ని గుర్తించారు. కన్నీరుమున్నీరుగా విలపించారు.
తల్లిదండ్రుల రోదన మిన్నంటింది. చదువుకోమని చెప్పినందుకే ఆత్మహత్య చేసుకుంటావా అంటూ తల్లి మధు మృతదేహంపై పడి విలపించిన తీరు అక్కడివారికి కంటతడి పెట్టించింది. పోస్టుమార్టం అనంతరం కాశీబుగ్గ టెలిఫోన్ ఎక్చేంజ్కు ఎదురుగా ఉన్న శ్మశాన వాటికలో దహన సంస్కారాలు చేశారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రాణాలు తీసిన ఫ్రెండ్షిప్ డే
Published Wed, Aug 9 2017 7:58 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోమ్ ఓటింగ్ ప్రక్రియ వేగవంతం చేయండి
మోదీని ఆపే దమ్ము కేసీఆర్కే ఉంది
కాలవ అండ .. కరిగిన కొండ!
వైఎస్ జగన్తోనే సంక్షేమం
ప్రమాదంలో ఒకరి మృతి
ఐస్క్రీం తిని 100 మందికి అస్వస్థత
పాండవపురలోనూ అబార్షన్ దందా
స్టీరింగ్ విరిగి.. వరి మడిలోకి
కస్టడీలో రేవణ్ణ విచారణ
వీడియో బాధితుల కోసం సిట్ సహాయవాణి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement