శ్రీకాకుళం సిటీ: జిల్లా బీసీ సంక్షేమాధికారి కార్యాలయంలో శనివారం ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించడం కలకలం రేపింది. ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల ఏసీబీ సీఐలు ఆజాద్, లకో్ష్మజీల ఆధ్వర్యంలో వచ్చిన ప్రత్యేక బృందం రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించింది. గత బీసీ సంక్షేమాధికారి ఆర్.వి.నాగరాణి హయాంలో జరిగిన పలు అక్రమాలపై వచ్చిన ఆరోపణలపై ఈ విచారణ నిర్వహించారు. ఆమె పనిచేసిన 2011 జూన్ నుంచి 2014 జనవరి మధ్య కాలంలో నిధుల కేటాయింపులు, వాటి వినియోగం, సిబ్బంది పదోన్నతులు, వసతి గృహాల కు సామగ్రి కేటాయింపులు తదితర కీలక రికార్డులును స్వాధీనం చేసుకున్నారు. తమ వద్ద ఉన్న వివరాలను రికార్డుల్లో ఉన్న వివరాలతో సరి చూశారు.
అనుమానాలున్న పలు ఫైళ్లను తమ వెంట తీసుకెళ్లారు. ఈ సందర్భంగా
ప్రస్తుత బీసీ వెల్ఫేర్ అధికారి లజపతిరావును కూడా విచారించి పలు వివరాలు సేకరించారు. ఇదే కార్యాలయంలో నాగరాణి హయాంలో పని చేసిన ఓ ఉద్యోగి గురించి అధికారులు ప్రత్యేకంగా ఆరా తీసినట్లు తెలిసింది. శనివారం రమ్మని ఆ ఉద్యోగిని పిలిపించినప్పటికీ ఆయన హాజరుకాకపోవడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. కాగా నాగరాణి వ్యవహారంపై 2012లోనే పలు ఫిర్యాదులు అందాయి. వీటిపై 2013 జనవరిలో ఆ శాఖ జాయింట్ డెరైక్టర్ అలోక్కుమార్ విచారణ జరిపారు. ఇప్పుడు కూడా నాగరాణి హయాంలోని వ్యవహారాలపైనే విచారణ జరిపామని సీఐలు ఆజాద్, లక్ష్మోజీలు చెప్పారు. అప్పటి రికార్డులను తనిఖీ చేశామన్నారు. నిధులు, అధికార దుర్వినియోగం ఆరోపణలపై వాస్తవాలు తెలుసుకునే పనిలో ఉన్నామని వారు వివరించారు.
బీసీ వెల్ఫేర్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
Published Sun, Jul 20 2014 1:52 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- పండ్ల తోటలకు.. 'సన్ బర్న్' ముప్పు!
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- విడాకులపై సలహా అడిగిన యువతి.. శ్రీజ పోస్ట్ వైరల్
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
Advertisement