ఆటో బోల్తా : 8 మందికి గాయాలు | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా : 8 మందికి గాయాలు

Published Fri, Feb 27 2015 10:40 AM

auto roll, 8 injured in prakasam distirict

కారంచేడు: ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయి ఓ ఆటో అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 8 మంది కూలీలకు గాయాలయ్యాయి.  ప్రకాశం జిల్లా కారంచేడు మండలం దగ్గుబాడు సమీపంలో శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ప్రమాదానికి గురైన ఆటో మండలంలోని స్వర్ణ గ్రామం నుంచి కూలీలను తీసుకెళ్తుతోంది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
 

Advertisement
Advertisement