'ఒక్క రూపాయి కూడా ఎక్కువ తీసుకోలేదు' | Sakshi
Sakshi News home page

'ఒక్క రూపాయి కూడా ఎక్కువ తీసుకోలేదు'

Published Fri, Oct 31 2014 3:14 PM

'ఒక్క రూపాయి కూడా ఎక్కువ తీసుకోలేదు'

హైదరాబాద్: కార్మిక శాఖ నిధుల్లో ఒక్క రూపాయి కూడా ఎక్కువ తీసుకోలేదని ఆంద్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. నిబంధనల ప్రకారం తమ రాష్ట్రానికి రావాల్సిన వాటా నిధులనే తీసుకున్నామని చెప్పారు. తెలంగాణ చేస్తున్న ఆరోపణలను వెనక్కు తీసుకోవాలని, క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్, అదర్ కన్‌స్ట్రక్షన్ వర్క్‌ర్స్ వెల్ఫేర్ (ఏపీబీఓసీడబ్ల్యూడబ్ల్యూ) బోర్డు అధికారులు ఉమ్మడిరాష్ట్ర కార్మికశాఖ ఖాతాలో ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్ డబ్బును దశలవారీగా విజయవాడలోని బ్యాంకులకు మళ్లించడంతో పోలీసు కేసుకు దారి తీసింది. దీంతో ఏపీబీఓసీడబ్ల్యూడబ్ల్యూ బోర్డు కార్యదర్శి పీవీ మురళీ సాగర్, ఫైనాన్స్ మేనేజర్ రామారావులను గురువారం పోలీసులు విచారించారు.

Advertisement
Advertisement