వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబునాయుడికి వత్తాసు పలికే కొన్ని పత్రికలు, చానెళ్లు నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా పనిగట్టుకొని వాస్తవాలను వక్రీకరిస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. దిగజారుడు రాతలతో పత్రికా విలువలను దిగజార్చడం సరికాదని హితవు పలికారు. గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘నంద్యాల ఉప ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టి, భయపెట్టి గెలవాలనే తాపత్రయంతో చంద్రబాబు, మంత్రులు, టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబుకి వత్తాసు పలికే కొన్ని పత్రికలు, చానెళ్లు పనిగట్టుకొని అక్కడి అంశాలను వక్రీకరిస్తున్నాయి. మాజీ ఎంపీ గంగుల ప్రతాప్రెడ్డి టీడీపీలో చేరితే ఆయన వైఎస్సార్సీపీ నుంచి వలస వెళ్లి టీడీపీలో చేరినట్లు, వైఎస్సార్సీపీకి ఎదురుదెబ్బ తగిలినట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశాయి. గంగుల ప్రతాప్రెడ్డికి, వైఎస్సార్సీపీకి ఎప్పుడూ సంబంధం లేదు. ఆయన వైఎస్సార్సీపీలో చేరలేదు, ఎప్పుడూ పనిచేయలేదు’’ అని రాంబాబు స్పష్టంచేశారు.
దిగజారిన మీడియా అధిపతి :చంద్రబాబునాయుడితో అంటకాగుతున్న ఒక పత్రిక, చానెల్ అధిపతి పనిగట్టుకొని ఉపఎన్నికల ముందు ట్రెండ్ టీడీపీకి అనుకూలంగా ఉందని చూపించే నీచానికి దిగజారారని అంబటి దుయ్యబట్టారు. వాస్తవానికి టీడీపీ నుంచే వైఎస్సార్సీపీలోకి అనేకమంది తరలివస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్సీ పదవినీ, ఇతర హోదాలను కూడా వదులుకుని శిల్పా చక్రపాణిరెడ్డి, శిల్పా మోహన్రెడ్డి వచ్చారని, మోహన్రెడ్డి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నిలుచున్నారని గుర్తుచేశారు.
అవి దిగజారుడు రాతలు
Published Fri, Aug 18 2017 1:30 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజస్తాన్తో ఢిల్లీ కీలక పోరు.. కొత్త ప్లేయర్లు ఎంట్రీ
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
బీజేపీకి షాక్.. కాంగ్రెస్ వైపు తిరిగిన ముగ్గురు ఎమ్మెల్యేలు
No Headline
రోహిత్ వరుస వైఫల్యాలకు కారణం అదే! ఇకనైనా..
No Headline
నేను పక్కా లోకల్..
No Headline
తప్పక చదవండి
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement