మహిళపై యాసిడ్ దాడి | Sakshi
Sakshi News home page

మహిళపై యాసిడ్ దాడి

Published Wed, May 27 2015 9:54 AM

Acid attack on girl in prakasham district

ప్రకాశం: నిద్రిస్తున్న మహిళపై ఓ వ్యక్తి యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం గార్లపాడు పునరావాస కాలనీలో జరిగింది. కొప్పోలు విజయలక్ష్మి తన ఇంట్లో నిద్రిస్తుండగా మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఓ వ్యక్తి ఆమె ముఖం, చాతీపై యాసిడ్ పోసి పరారయ్యాడు.

తీవ్ర గాయాలైన ఆమెను కుటుంబ సభ్యులు సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యం చేసేందుకు సిబ్బంది నిరాకరించడంతో..ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. దాడికి పాల్పడిన నిందితుడు విజయలక్ష్మి బంధువుగా అనుమానిస్తున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement