బి.కొత్తకోట: అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న బి.కొత్తకోట ఆదర్శ పాఠశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ కిరణ్చంద్రకుమార్ తీరుపై ఆవేదన వ్యక్తం చేస్తూ మంగళవారం 8వ తరగతి విద్యార్థినీవిద్యార్థులు మూ డు గంటలపాటు ధర్నా నిర్వహించారు. వేధిస్తూ, అసభ్యకరంగా ప్రవర్తిస్తు న్న ప్రిన్సిపాల్ మాకొద్దంటూ నినాదా లు చేశారు. ఈ సంఘటనపై జిల్లా కలెక్టర్, డీఈవో సీరియస్ అయ్యారు. తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకొంటామని ప్రకటించారు.
వివరాల్లోకి వెళ్తే... కొంతకాలంగా ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ కిరణ్ వేధిస్తున్నారంటూ 21 ఆరోపణలతో కూడిన ఫిర్యాదును 81 మం ది విద్యార్థినీ విద్యార్థుల సంతకాలతో మధ్యాహ్నం ఒంటిగంటకు ఎమ్మార్సీ కార్యాలయానికి చేరుకున్నారు. ఎంఈ వో ధనరాజ్కు వినతిపత్రం అందజేశారు. కిరణ్ తమను ఏరకంగా వేధిస్తున్నారో సవివరంగా చెప్పుకొన్నారు. దీనిపై చర్యలు తీసుకొవాలనీ, లేకుంటే రాత్రంతా ఆందోళన చేస్తామని హెచ్చరిస్తూ కార్యాలయంలోనే బైఠాయించారు.
కొంతసేపటి తర్వాత కార్యాల యం ఎదుట ధర్నా నిర్వహించి, నినాదాలు చేశారు. ఈ విషయాన్ని కలెక్టర్, డీఈవోల దృష్టికి వెళ్లడంతో వారు స్పం దించారు. డీఈవో ఎంఈవోతో ఫోన్లో మాట్లాడారు. ప్రిన్సిపాల్పై విద్యార్థులు చేస్తున్న ఆరోపణలను తెలుసుకొన్నారు. దీనిపై డీఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే విచారించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కలెక్టర్ కూడా ఆరా తీసి వివరాలు తెలుసుకొన్నారు. దీనిపై విచారణ జరిపి నివేదిక ఇస్తామని ఎంఈవో చెప్పడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఎమ్మెల్యే శంకర్కు ఫిర్యాదు చేశారు.
‘గాడిదలకు పుట్టారా’
తరగతి గదిలో పాఠాలు చేప్పే కిరణ్ చాలా అసభ్యకరమైన పదాలు వాడు తూ తిడుతుంటారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. గాడిదలకు పుట్టారా లేక కంచర గాడిదకు, అడ్డ గాడిదలకు పుట్టారా అంటూ అవహేళనగా మాట్లాడుతారని చెప్పారు. 12 పీరియడ్లకు సరిపోయే సిలబస్ను అరగంటలో ముగించి.. డౌట్లు అడిగితే ‘డౌట్లు కడి గేసుకోండి’ అంటూ హేళన గా మాట్లాడుతున్నారని ఆవేదన వ్య క్తం చేశారు. కంప్యూటర్ పాఠాలు నే ర్చుకునే వీలులేకుండా గదిలోకి వెళ్లనివ్వడంలేదని చెప్పారు. మీరిప్పుడు 8, 9లోకి రండి టార్చర్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తానంటూ బెదిరిం చారని వాపోయారు. ఒకరోజు ఆల స్యంగా వస్తే వారం రోజులు గైర్హాజరు వేస్తూ, చాలాసార్లు కొట్టారని ఈ వేధింపుల నుంచి కాపాడమంటూ వేడుకొన్నారు.
‘పనిలేక వచ్చుంటారులే’
ఈ విషయంపై ఫోన్లో ప్రిన్సిపాల్ కిరణ్ వివరణ కోరగా వాళ్లు పనిలేక ధర్నాకు వచ్చుంటారులే.. ఇదంతా మామూలేనంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. వేధిస్తున్నారన్న విషయంపై వివరణ ఇవ్వలేదు.
వేధింపుల ప్రిన్సిపాల్ మాకొద్దు
Published Wed, Apr 22 2015 3:15 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోమ్ ఓటింగ్ ప్రక్రియ వేగవంతం చేయండి
మోదీని ఆపే దమ్ము కేసీఆర్కే ఉంది
కాలవ అండ .. కరిగిన కొండ!
వైఎస్ జగన్తోనే సంక్షేమం
ప్రమాదంలో ఒకరి మృతి
ఐస్క్రీం తిని 100 మందికి అస్వస్థత
పాండవపురలోనూ అబార్షన్ దందా
స్టీరింగ్ విరిగి.. వరి మడిలోకి
కస్టడీలో రేవణ్ణ విచారణ
వీడియో బాధితుల కోసం సిట్ సహాయవాణి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement