తిరుపతిలో విషాదం | Sakshi
Sakshi News home page

తిరుపతిలో విషాదం

Published Wed, Mar 22 2017 11:29 AM

తిరుపతిలో విషాదం

తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతిలో విషాదం చోటుచేసుకుంది. నీటి కుంటలో పడి తల్లీ, కుమారుడు, కుమార్తె మృతిచెందారు. బట్టలు ఉతకడానికి నీటి కుంట వద్దకు వెళ్లిన ముగ్గురు ప్రమాదవశాత్తు నీట మునిగి మరణించారు.

తిరుపతి శివారు పాతకాలువలో ఓ మహిళ బట్టలు ఉతకడానికి వెళ్లింది. ఆమెతో పాటు కుమారుడు, కుమార్తె కూడా వచ్చారు. అక్కడే ఆడుకుంటున్న చిన్నారులు ప్రమాదవశాత్తు నీట మునగడం గుర్తించిన మహిళ వారిని రక్షించే క్రమంలో నీట మునిగింది. విషయం తెలుసుకున్న స్థానికులు ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు.
 

Advertisement
Advertisement