31 లక్షల మంది రైతులకు రుణమాఫీ | Sakshi
Sakshi News home page

31 లక్షల మంది రైతులకు రుణమాఫీ

Published Mon, Nov 24 2014 7:04 PM

31 lakhs farmers eligible for loan waiver in andhra pradesh

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో 31 మంది రైతులను రుణమాఫీకి అర్హులుగా గుర్తించామని, వీరికి ముందు చెల్లింపులు చేసేలా చర్యలు తీసుకుంటామని వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. మిగిలిన రైతుల్లో కూడా అర్హులుంటే వారిని తర్వాతి జాబితాలో చేర్చుకుంటామని తెలిపారు.

పామోలిన్ రైతులకు న్యాయం చేసేందుకు ధర పెంచే ఆలోచన చేస్తున్నామని ప్రత్తిపాటి చెప్పారు. హుదూద్ తుపాను నష్టం అంచనా వేసేందుకు మంగళవారం కేంద్ర బృందం వస్తోందని తెలిపారు.

Advertisement
Advertisement